AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 581, నిఫ్టీ 150 పాయింట్లు అప్..

వరుస నష్టాలతో కుదేలవుతున్న స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల బాట పట్టాయి. నిన్న 1,491 పాయింట్లు నష్టపోయిన BSE సెన్సెక్స్ ఇవాళ 581 పాయింట్లు పెరిగి..

Stock Market: వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 581, నిఫ్టీ 150 పాయింట్లు అప్..
Stock Market
Srinivas Chekkilla
|

Updated on: Mar 08, 2022 | 5:40 PM

Share

వరుస నష్టాలతో కుదేలవుతున్న స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల బాట పట్టాయి. నిన్న 1,491 పాయింట్లు నష్టపోయిన BSE సెన్సెక్స్ ఇవాళ 581 పాయింట్లు పెరిగి 53,424 వద్ద స్థిరపడింది. సోమవారం 382 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ మంగళవారం 150 పాయింట్లు పెరిగి 16,013 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, చమురు భయాలు వెంటాడినప్పటికీ చివరి గంటలో కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పైకి లేచాయి. దాదాపు మధ్యాహ్నం రెండు గంటల వరకు సూచీలు భారీ ఊగిసలాట మధ్య చలించాయి. క్రూడ్ ఆయిల్ కూడా భారీగా పెరగకపోవడంతో మార్కెట్లు సానుకూలంగా చలించాయి.

నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.24 శాతం, స్మాల్ క్యాప్ 1.51 శాతం పెరిగాయి. 15 సెక్టర్లలో 13 లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఐటీ 2.69 శాతం, నిఫ్టీ ఫార్మా 2.38 శాతం పెరిగాయి. స్టాక్-స్పెసిఫిక్ ఫ్రంట్‌లో ఇండియన్ ఆయిల్ కార్ప్ నిఫ్టీలో టాప్ గెయినర్‌గా ఉంది. ఎందుకంటే స్టాక్ 4.23 శాతం పెరిగి రూ. 117కి చేరుకుంది. సన్ ఫార్మా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, సిప్లా మరియు టిసిఎస్ కూడా లాభపడ్డాయి.హిందాల్కో, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌ నష్టపోయాయి. 2,233 కంపెనీల షేర్ల వాల్యూ పెరగ్గా.. 1,101 కంపెనీల షేర్లు వాల్యూ తగ్గింది. 30 షేర్ల బిఎస్‌ఇ ఇండెక్స్‌లో సన్ ఫార్మా, టిసిఎస్, టెక్ మహీంద్రా, ఎన్‌టిపిసి, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గెయినర్‌లలో ఉన్నాయి.

Read Also.. Petrol, Diesel prices: వాహనదారులకు షాక్‌.. ఈవారంలోనే పెట్రో మంట.. లీటరుపై రూ.15 పెరిగే అవకాశం!!