Power Banks: 20,000 mAh పవర్‌ బ్యాంకు కేవలం రూ.350కే.. అందులో ఏముంటుందో తెలిస్తే మైండ్‌బ్లాంకే.. వీడియో

మోసం, అవినీతిపై రోజుకో కొత్త ఆరోపణలు వస్తున్నాయి. బియ్యం, పప్పులు వంటి నిత్యావసర ఆహార ఉత్పత్తులు, ఖరీదైన టీవీ ఫ్రిజ్‌లు అన్నీ నకిలీవే. అసలు ప్యాకేజింగ్‌లో పాత లేదా నకిలీ వస్తువులను విక్రయించడం ద్వారా వినియోగదారులు మోసపోతున్నారు. ఈసారి పవర్ బ్యాంక్ లోనూ అలాంటి మోసం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఓ వ్యక్తి. రైలులో అమ్మే చవక పవర్ బ్యాంక్ లోపల ఏముందో..

Power Banks: 20,000 mAh పవర్‌ బ్యాంకు కేవలం రూ.350కే.. అందులో ఏముంటుందో తెలిస్తే మైండ్‌బ్లాంకే.. వీడియో
Power Banks
Follow us

|

Updated on: Jun 20, 2024 | 1:28 PM

మోసం, అవినీతిపై రోజుకో కొత్త ఆరోపణలు వస్తున్నాయి. బియ్యం, పప్పులు వంటి నిత్యావసర ఆహార ఉత్పత్తులు, ఖరీదైన టీవీ ఫ్రిజ్‌లు అన్నీ నకిలీవే. అసలు ప్యాకేజింగ్‌లో పాత లేదా నకిలీ వస్తువులను విక్రయించడం ద్వారా వినియోగదారులు మోసపోతున్నారు. ఈసారి పవర్ బ్యాంక్ లోనూ అలాంటి మోసం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఓ వ్యక్తి. రైలులో అమ్మే చవక పవర్ బ్యాంక్ లోపల ఏముందో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. కొందరు ప్రయాణికులు రైళ్లలో దూర ప్రయాణం చేసేవారు వెంట పవర్‌ బ్యాంక్‌, ఛార్జర్‌, ఇతర వస్తువులు ఉంటాయి. ఇందులో వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కూడా ఉంటాయి. మార్కెట్‌లో రూ.1,000-2,000 ఖరీదు చేసే మొబైల్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్‌లను రైళ్లలో కేవలం రూ.400-500 వరకు విక్రయిస్తున్నారు. పవర్ బ్యాంక్‌లను ఇంత చౌకగా ఎందుకు ఉంటాయన్నది మీకు అనుమానం రావాలి. ఇవేమి అనుమానం రాకుండా మీరు కొనుగోలు చేసినట్లయితే మోసపోయినట్లే. పవర్ బ్యాంక్‌లో 10,000 లేదా 20,000 mAh బ్యాటరీ ఉండదు. కేవలం మీర రాతలు మాత్రమే ఉంటాయి. అందులో ఉండేది మట్టి ముద్ద.

ఇది కూడా చదవండి: School Holidays: సంచలన నిర్ణయం.. జూలై 1 వరకు పాఠశాలలు బంద్‌.. కారణం ఏంటంటే..

ఇవి కూడా చదవండి

తాజాగా ఓ ప్రయాణికుడు సుదూర రైలులో ప్రయాణిస్తూ నకిలీ పవర్ బ్యాంక్‌ను బయటపెట్టాడు. ‘స్కామ్ 2024’ అనే వైరల్ వీడియోలో విక్రేత వివిధ మొబైల్ కంపెనీల పవర్ బ్యాంక్‌లను చూపుతున్నట్లు చూపిస్తుంది. వీటన్నింటి ధర కేవలం 500 నుంచి 550 రూపాయల వరకు ఉంటుంది. పవర్ బ్యాంక్‌కి ఒక సంవత్సరం గ్యారెంటీ కూడా లభిస్తుందని విక్రేత చెబుతుండటం గమనార్హం. ఒక వేళ అది కిందపడిపోయి ఏదైనా డ్యామెజ్‌అయితే దానికి ఎలాంటి వారంటీ ఉండదని కూడా చెబుతుంటాడు. అతడు ఈ వారంటీ వివరాలు చెబుతుంటే నేరుగా కంపెనీ నుంచి హామీ ఇచ్చినట్లే ఉంటుంది.

Power Banks

Power Banks

ఇది కూడా చదవండి: Broadband Plans: మీకు ఇంటర్నెట్‌ కావాలా? దిమ్మదిరిగే మూడు చవకైన బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్స్‌!

అయితే రైలులు ఇలా పవర్‌ బ్యాంకులను అమ్ముతూ ప్రయాణికులతో బేరం అడుతుంటారు. బేరం కుదుర్చుకున్న ప్రయాణికుడు తుది ధరను చెప్పమని అడగగా, చివరకు ఆ ఎలక్ట్రానిక్‌ వస్తువుల అమ్మే యువకుడు రూ.350 అని ధరను కుదుర్చుకున్నాడు. సదరు వ్యక్తి పవర్ బ్యాంక్ తీసుకుని ఓపెన్ చేశాడు. అందులో ఉన్నది బ్యాటరీ కాదు.. అది మట్టి ముద్దతో ఉందని తేలింది. ఇది చూసిన అమ్మే వ్యక్తి వెంటనే సదరు వ్యక్తి చేతిలోని పవర్ బ్యాంక్‌ను లాక్కున్నాడు. అతను పవర్ బ్యాంక్‌ను ఎందుకు పగలగొట్టావని గొడవకు దిగాడు. చివరకు అమ్మేవాడు ఆ ప్రయాణికుడిని కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. సో.. మీరు కూడా రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఇటువంటి ఎలక్ట్రానిక్‌ వస్తువు అమ్ముతుంటే జాగ్రత్తగా ఉండండి. తక్కువ ధరకే వస్తుంది కదా అని తొందరపడితే మోసపోతారు. ఏదైనా కొనాలనుకుంటే మంచి షాపుల్లో కొనడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి