AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rs 2000 Notes: 2000 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.. లేకపోతే ఆదాయపు పన్ను నోటీసు వస్తుంది

మీ దగ్గర కూడా 2000 రూపాయల నోట్లు ఉంటే, వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసే ముందు ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి. సెప్టెంబర్ 30, 2023లోపు ఏదైనా బ్యాంకు శాఖలో రూ.2,000 నోట్లను డిపాజిట్ చేయాలని ఆర్‌బీఐ కోరింది..

Rs 2000 Notes: 2000 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.. లేకపోతే ఆదాయపు పన్ను నోటీసు వస్తుంది
Income Tax Notices
Subhash Goud
|

Updated on: May 22, 2023 | 6:30 PM

Share

మీ దగ్గర కూడా 2000 రూపాయల నోట్లు ఉంటే, వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసే ముందు ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి. సెప్టెంబర్ 30, 2023లోపు ఏదైనా బ్యాంకు శాఖలో రూ.2,000 నోట్లను డిపాజిట్ చేయాలని ఆర్‌బీఐ కోరింది. అయితే ఆర్బీఐ ఆదేశాలతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. మీరు బ్యాంకు నుంచి 2000 రూపాయల (20000 రూపాయలు విలువ) నోట్లను ఒకేసారి మార్చుకోవచ్చు. ఇది కాకుండా, నగదు డిపాజిట్ చేయడానికి ఎటువంటి పరిమితి లేదు. అయితే నోట్లను డిపాజిట్‌ చేసే ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. లేకపోతే ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి నోటీలు వచ్చే అవకాశాలున్నాయి.

ఇవి తప్పకుండా ఉండాలి:

ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉండి బ్యాంకు ఖాతాలో జమ చేయాలనుకునే వారు ఏం చేయాలి? దీని కోసం, వారు డబ్బు ఆధారాలను నిరూపించడానికి ఖచ్చితమైన రికార్డులు, పత్రాలను తప్పకుండా ఉండాలి. దీనితో మీరు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలనైనా నివారించవచ్చు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేందుకు పరిమితి ఉంటుంది. బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసిన వారి రికార్డును నిర్వహిస్తారు.

నగదు డిపాజిట్ చేయడానికి పరిమితి:

బ్యాంకు నుంచి పెద్ద సంఖ్యలో లావాదేవీలు జరిగినప్పుడు ఆర్థిక లావాదేవీల వివరాల గురించి ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయడం జరుగుతుంది. ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసే వారి ఫారమ్ 26ASలో ఈ సమాచారం చూపబడుతుంది. ఆర్థిక లావాదేవీ ప్రకటనలో, ఖాతాలో నగదు జమ చేయడానికి పరిమితి నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

పొదుపు ఖాతాలో ఏటా 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జమ చేస్తే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు అందుతుంది. అదేవిధంగా కరెంట్ ఖాతాలో 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జమ చేస్తే ఈ పరిస్థితిలో అధికారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. మీరు డిపాజిట్ చేసిన మొత్తం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)తో సరిపోలకపోతే మీరు దీనిపై ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు పొందవచ్చు.

ఆదాయపు పన్ను శాఖ పంపిన నోటీసులో నగదు డిపాజిట్ మొత్తానికి సంబంధించి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. అందువల్ల మీరు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తుంటే దాని వివరాలను రికార్డ్ చేయడం ముఖ్యం. లేకపోతే ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?