JIO: కొనసాగుతోన్న జియో హవా.. 3.16 కోట్ల యూజర్లతో మొదటి స్థానం సుస్థిరం.. తెలుగు రాష్ట్రాల్లో..
JIO: టెలికాం ఇండస్ట్రీలో ఓ సంచలనంగా దూసుకొచ్చింది రిలయన్స్ కంపెనీకి చెందిన జియో. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకొని టెలికాం రంగంలో సరికొత్త చరిత్రకు నాంది పలికింది. తాజాగా...
JIO: టెలికాం ఇండస్ట్రీలో ఓ సంచలనంగా దూసుకొచ్చింది రిలయన్స్ కంపెనీకి చెందిన జియో. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకొని టెలికాం రంగంలో సరికొత్త చరిత్రకు నాంది పలికింది. తాజాగా ట్రాయ్ విడుదల చేసిన టెలికాం యూజర్ల గణంకాల ప్రకారం.. రిలయన్స్ జియో గడిచిన ఫిబ్రవరి నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 1.48 లక్షలకుపైగా కొత్తచందాదారులను సంపాదించుకుంది. ఇక ఫిబ్రవరి నాటికి జియో యూజర్ల సంఖ్య ఏకంగా 3.16 కోట్లకు చేరింది. దీంతో 40 శాతం మార్కెట్ వాటాతో జియో మొదటి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక మరో ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్కు గడిచిన ఫిబ్రవరి నెలలో కేవలం 72,559 మొబైల్ యూజర్లు మాత్రమే కొత్తగా చేరారు. ఇదిలా ఉంటే మరో వైపు వోడాఫోన్ ఐడియా 1,90,341 మంది సభ్యులను, బీఎస్ఎన్ఎల్ 7880 మంది కస్టమర్లను కోల్పోవడం గమనార్హం. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే జియో అత్యధికంగా 42.66 లక్షల మంది కొత్త యూజర్లను సంపాదించుకోగా.. ఎయిర్టెల్ 37.3 లక్షల యూజర్లను, వొడాఫోన్ ఐడియా 6.5 లక్షల కొత్త యూజర్లను ఆకట్టుకుంది. ఇక వొడాఫోన్, ఐడియా 6.5 లక్షల మంది యూజర్లను కొత్తగా చేర్చుకుంది. రకరకలా ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా.. బీఎస్ఎల్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. తాజాగా బీఎస్ఎన్ఎల్ ఏకంగా 3.6 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఇక డేటా డౌన్లోడ్ స్పీడ్లోనూ జియో అగ్రస్థానంలో నిలిచింది. సెకనుకు 20.1 మెగాబిట్ వేగంతో జియో డౌన్ లోడ్ స్పీడ్ లో టాప్ లో ఉంది.
Also Read: Sonu Sood : సోనూ ఫౌండేషన్ కి నెల్లూరు అంధయువతి విరాళం.. ఎమోషనల్ అయిన రియల్ హీరో
AP Crime News: గుంటూరు జిల్లాలో దారుణం, అన్నదమ్ముల పిల్లల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి