AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI MPC Meet: ఈఎంఐలు చెల్లించే వారికి గుడ్‌న్యూస్‌.. ఆర్బీఐ కీలక నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ 3 రోజుల కొనసాగుతున్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ సమావేశంలో రెపోరేటును యథాతథంగా ఉంచారు. ఎన్నికలకు ముందు రిజర్వ్ బ్యాంక్ ప్రజలకు గొప్ప ఊరటనిచ్చింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వివరిస్తూ, ఈసారి కూడా రెపో రేటులో..

RBI MPC Meet: ఈఎంఐలు చెల్లించే వారికి గుడ్‌న్యూస్‌.. ఆర్బీఐ కీలక నిర్ణయం
RBI
Subhash Goud
|

Updated on: Apr 05, 2024 | 11:13 AM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ 3 రోజుల కొనసాగుతున్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ సమావేశంలో రెపోరేటును యథాతథంగా ఉంచారు. ఎన్నికలకు ముందు రిజర్వ్ బ్యాంక్ ప్రజలకు గొప్ప ఊరటనిచ్చింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వివరిస్తూ, ఈసారి కూడా రెపో రేటులో ఎటువంటి మార్పు చేయలేదని, ఈ రేట్లను 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచామని చెప్పారు. అంటే మీ EMIలో ఎలాంటి మార్పు ఉండదు. రెపో రేట్లను స్థిరంగా ఉంచాలని ఆర్‌బీఐ నిర్ణయించడం ఇది వరుసగా ఏడోసారి.

ఫిబ్రవరి 2023 నుండి రెపో రేటు మారలేదు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చివరిసారిగా రెపో రేటును ఫిబ్రవరి 8, 2023న పెంచింది. అప్పుడు ఆర్‌బీఐ దానిని 25 బేసిస్ పాయింట్లు లేదా 0.25 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది. అప్పటి నుంచి వరుసగా ఆరు ఎంపీసీ సమావేశాల్లో ఈ రేట్లను యథాతథంగా ఉంచగా, ఈసారి కూడా అందులో ఎలాంటి మార్పు ఉండదని ముందే ఊహించారు. రెపో రేటుతో పాటు, రిజర్వ్ బ్యాంక్ రివర్స్ రెపో రేటును 3.35% వద్ద స్థిరంగా ఉంచింది. MSF రేటు, బ్యాంక్ రేటు 6.75% వద్ద ఉన్నాయి. అయితే ఎస్‌డీఎఫ్‌ రేటు 6.25% వద్ద స్థిరంగా ఉంది.

రెపో రేటు EMIని ఎలా ప్రభావితం చేస్తుంది?

రెపో రేటు అనేది ఏదైనా నిధుల కొరత ఏర్పడినప్పుడు ఒక దేశం సెంట్రల్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ద్రవ్య అధికారులు రెపో రేటును ఉపయోగిస్తారు. నిజానికి బ్యాంకుల నుంచి సామాన్యులు తీసుకునే రుణాల ఈఎంఐపై రెపో రేటు ప్రభావం కనిపిస్తోంది. రెపో రేటులో కోత ఉంటే సాధారణ ప్రజల గృహ, కారు రుణాల ఈఎంఐ తగ్గుతుంది. అలాగే రెపో రేటు పెరిగితే కారు, గృహ రుణాల ధరలు పెరుగుతాయి.

నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఆహార ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లు, క్రెడిట్ వరుసగా 14.5-15%, 16.0-16.5% పెరుగుతాయని నివేదిక అంచనా వేసింది. నివేదిక ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మాత్రమే రేట్లను తగ్గించగలదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి