AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pension: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 25 ఏళ్ల సర్వీస్ తర్వాత పూర్తి పెన్షన్ ప్రయోజనం

ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప వార్త అందింది. ఇక నుంచి వారు పూర్తి పెన్షన్ పొందేందుకు సేవా కాల పరిమితిని తగ్గించింది ప్రభుత్వం. ఇప్పుడు 28 ఏళ్లకు బదులు, 25 ఏళ్ల సర్వీసు తర్వాత మాత్రమే పూర్తి పెన్షన్ పొందేందుకు అర్హులని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది..

Pension: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 25 ఏళ్ల సర్వీస్ తర్వాత పూర్తి పెన్షన్ ప్రయోజనం
Pension Benefits
Subhash Goud
|

Updated on: Jun 07, 2023 | 4:42 PM

Share

ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులు 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత పదవీ విరమణ తర్వాత మాత్రమే పూర్తి పెన్షన్ ప్రయోజనం పొందుతారు. గతంలో ఈ పరిమితి 28 ఏళ్లుగా ఉండేది. మంగళవారం రాత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం తీసుకున్నది ఏ రాష్ట్రమో కాదు.. రాజస్థాన్‌. అక్కడి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా ఈ వార్త రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప వార్తగా మారింది. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.

రాజస్థాన్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత పూర్తి పెన్షన్ పొందుతారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. సీఎం అశోక్ గెహ్లాట్ మంత్రివర్గం రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1996 సవరణ ప్రతిపాదనను ఆమోదించింది. దీంతో 28 ఏళ్ల సర్వీసుకు బదులు ఉద్యోగులు 25 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసి రిటైర్మెంట్‌ పూర్తయితేనే పూర్తి పెన్షన్‌ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా పెన్షనర్లు, 75 సంవత్సరాల కుటుంబ పెన్షనర్లు 10 శాతం అదనపు పెన్షన్ అలవెన్స్ పొందుతారు.

ఈ నిర్ణయం ఏప్రిల్ 1, 2023 నుంచే అమల్లోకి..

ఒక ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించిన సందర్భంలో వికలాంగుడైన కుమారుడు/కుమార్తె నెలకు రూ.12,500 వరకు సంపాదిస్తున్న అర్హతగల సభ్యులు కూడా కుటుంబ పెన్షన్ ప్రయోజనాన్ని పొందగలరు. ఈ సవరణ నోటిఫికేషన్ ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది. సమావేశంలో ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా పదోన్నతులు, పింఛన్లు, ప్రత్యేక వేతనం, హోదాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ (రివైజ్డ్ పే) రూల్స్, 2017ను సవరించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో సిబ్బందికి ప్రత్యేక వేతనం పెరుగుతుంది. 2023-24 బడ్జెట్‌లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఈ విషయాన్ని ప్రకటించడం గమనార్హం. వీర్ గుర్జార్ వికాస్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్, భిల్వారా, రేగర్ సమాజ్, బికనీర్‌లకు భూమిని కేటాయించే ప్రతిపాదనను గెహ్లాట్ మంత్రివర్గం ఆమోదించింది. దీంతో పాటు దౌసా మెడికల్ కాలేజీ పేరును ‘పండిట్ నావల్ కిషోర్ శర్మ మెడికల్ కాలేజ్ దౌసా’గా మార్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి