Pure EV: నిజామాబాద్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్యాటరీ పేలుడుతో కంపెనీ కీలక నిర్ణయం.. 2వేల వాహనాల రీకాల్‌

Pure EV: అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో ప్రమాదం పొంచివుంటుంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన పలు ఎలక్ట్రిక్‌ వాహనాలలో అగ్ని ప్రమాదాలు..

Pure EV: నిజామాబాద్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్యాటరీ పేలుడుతో కంపెనీ కీలక నిర్ణయం.. 2వేల వాహనాల రీకాల్‌
Pure Ev
Follow us

|

Updated on: Apr 21, 2022 | 8:36 PM

Pure EV: అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో ప్రమాదం పొంచివుంటుంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన పలు ఎలక్ట్రిక్‌ వాహనాలలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బ్యాటరీ పేలుడు, ఇతర సమస్యలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చెన్నై, ఇతర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల్లో పేలుడు సంభవించగా, ఇక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారీ సంస్థ ఫ్యూర్‌ కంపెనికి చెందిన స్కూటర్‌ బ్యాటరీ పేలుడు సంభవించింది. నిజామాబాద్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ (Electric Scooter) బ్యాటరీని చార్జింగ్‌ పెట్టగా, ఒక్కసారిగా పేలడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్యూర్‌ (Pure) ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీకి చెందిన ETrance Plus, EPluto 7G మోడల్‌కు చెందిన 2,000 వాహనాలను రీకాల్‌ చేయాలని నిర్ణయించింది. వెనక్కి రప్పించే వాహనాలలో బ్యాటరీకి సంబంధించిన సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. పేలుడుకు గల కారణాలను తెలుసుకుని చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. కంపెనీ డీలర్‌షిప్‌ ద్వారా కస్టమర్లకు సమాచారం అందించి వాహనాలను రీకాల్‌ చేయనున్నట్లు తెలిపింది.

కాగా,నిజామాబాద్ లో ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ ఎస్‌బీఐ బ్యాంక్‌ ప్రాంతంలో నివాసం ఉండే కళ్యాణ్‌ రోజులాగే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్యాటరీని అర్ధరాత్రి సమయంలో ఇంట్లోని హాలులో చార్జింగ్‌ పెట్టాడు. అనంతరం తాత రామస్వామి(80), నాన్నమ్మ కమలమ్మతో కలిసి అదే హాల్‌లో పడుకున్నాడు. మరో గదిలో రామస్వామి కుమారుడు ప్రకాశ్‌, కోడలు కృష్ణవేణి పడుకున్నారు.

బుధవారం తెల్లవారుజామున బ్యాటరీ భారీ శబ్ధంతో పేలిపోయింది. శబ్ధానికి గదిలో నిద్రిస్తున్న ప్రకాశ్‌, కృష్ణవేణి బయటికు పరుగులు పెట్టారు. అంతలోనే బ్యాటరీలోని కెమికల్‌ హాల్‌లో వ్యాపించి దాని ద్వారా మంటలు రామస్వామి, కమలమ్మ, కళ్యాణ్‌కు అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన కృష్ణవేణికి సైతం గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రామస్వామిని ఆయన కుమారుడు ప్రకాష్‌ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

ఇవి కూడా చదవండి:

Nitin Gadkari: ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త నిబంధనలు ప్రకటిస్తాం.. ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలుళ్లపై స్పందించిన నితిన్ గడ్కరీ

EPFO: ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్‌ డబ్బుల విషయంలో కంపెనీ చుట్టు తిరుగుతున్నారా? ఆ పని మీరే చేసుకోవచ్చు.. ఎలాగంటే!

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..