Post Office: పోస్టాఫీసులో బెస్ట్ స్కీమ్స్.. అత్యధిక వడ్డీ అందించే పథకాలు
పోస్టాఫీసులో మంచి రాబడిని అందించే పథకాలు ఎన్నో ఉన్నాయి. వివిధ స్కీమ్లలో డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు అందుకోవచ్చు. ఒకేసారి పెట్టుబడి పెట్టడం, లేదా వాయిదాల ప్రకారం ఇన్వెస్ట్ చేయడం వంటి వాటిలో మంచి వడ్డీ రేట్లను అందుకోవచ్చు. ఇండియా పోస్ట్ ఆఫీస్ ఒక సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుబడిపై 6.9 శాతం వరకు వడ్డీని అందిస్తుంది. అదే సమయంలో వారు 2 సంవత్సరాల పెట్టుబడికి..
![Post Office: పోస్టాఫీసులో బెస్ట్ స్కీమ్స్.. అత్యధిక వడ్డీ అందించే పథకాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/post-office-scheme-2.jpg?w=1280)
పోస్టాఫీసులో మంచి రాబడిని అందించే పథకాలు ఎన్నో ఉన్నాయి. వివిధ స్కీమ్లలో డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు అందుకోవచ్చు. ఒకేసారి పెట్టుబడి పెట్టడం, లేదా వాయిదాల ప్రకారం ఇన్వెస్ట్ చేయడం వంటి వాటిలో మంచి వడ్డీ రేట్లను అందుకోవచ్చు. ఇండియా పోస్ట్ ఆఫీస్ ఒక సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుబడిపై 6.9 శాతం వరకు వడ్డీని అందిస్తుంది. అదే సమయంలో వారు 2 సంవత్సరాల పెట్టుబడికి 7 శాతం వడ్డీని, 3 సంవత్సరాల పెట్టుబడికి 7.1 శాతం వడ్డీ, 5 సంవత్సరాల పెట్టుబడికి 7.5 శాతం వడ్డీని అందిస్తారు.
మీరు ఈ పథకంలో రూ.1000 నుండి పెట్టుబడి పెట్టవచ్చు. తదుపరి పెట్టుబడి 100 గుణకాలలో ఉండాలి. ఈ పథకాలకు పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంటే, 5 సంవత్సరాల ప్రణాళికలో రూ.1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు.
ఈ విధంగా, మీరు ఈ పథకంలో 5 సంవత్సరాల పాటు రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే, మీరు ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం మెచ్యూరిటీ సమయంలో రూ.14,49,948 ఆదాయం పొందుతారు. అంటే మీకు రూ.4,49,948 వడ్డీ లభిస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకం 7.5 శాతం వడ్డీని అందిస్తుంది.
పెట్టుబడిపై వడ్డీ ఎంత?
అదేవిధంగా, మీరు ఈ పథకంలో 5 సంవత్సరాల పాటు రూ.1 లక్ష పెట్టుబడి పెడితే, మీకు రూ.1,44,995 రాబడి లభిస్తుంది. అలాగే రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.2,89,990, రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.4,34,984, రూ.4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 5,79,97, రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.7,24,974. అంటే వడ్డీగా రూ.లక్ష పెట్టుబడికి రూ.44,995. రూ.2 లక్షల పెట్టుబడికి రూ.89,990, రూ.3 లక్షల పెట్టుబడికి రూ.1,34,984 వడ్డీ లభిస్తుంది.
పోస్టల్ వడ్డీ రేట్లు
జూన్ 30, 2024 వరకు ఉన్న త్రైమాసికంలో, ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏప్రిల్ 1, 2024 నుండి ప్రారంభమై జూన్ 30, 2024తో ముగిసే వివిధ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్చి 8, 2024 నాటి పత్రికా ప్రకటనలో ప్రకటించింది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
పోస్టల్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్పై ప్రభుత్వం 8.2% వడ్డీని అందిస్తుంది. ఈ పథకంలో కనీస డిపాజిట్ రూ. 1000. ఇందులో గరిష్టంగా రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ఖాతాల ద్వారా వచ్చే మొత్తం వడ్డీ రూ.50,000 దాటితే, వడ్డీపై పన్ను విధించబడుతుంది. అలాగే, నిర్ణీత రేటులో మొత్తం వడ్డీ నుండి టీడీఎస్ తీసివేయబడుతుంది. ఫారమ్ 15 G/15H సమర్పించబడితే, పెరిగిన వడ్డీ సూచించిన పరిమితిని మించకుండా ఉంటే టీడీఎస్ తీసివేయరు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి