AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: మీరు పీఎం కిసాన్‌ పథకంలో డబ్బులు పొందుతున్నారా..? జూలై 31 వరకు గడువు పొడిగింపు.. లేకపోతే డబ్బులు రావు!

PM Kisan: మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతులకు, సామాన్య ప్రజలకు ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది..

PM Kisan: మీరు పీఎం కిసాన్‌ పథకంలో డబ్బులు పొందుతున్నారా..? జూలై 31 వరకు గడువు పొడిగింపు.. లేకపోతే డబ్బులు రావు!
Subhash Goud
|

Updated on: Jun 04, 2022 | 5:36 PM

Share

PM Kisan: మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతులకు, సామాన్య ప్రజలకు ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (Pradhan Mantri Kisan Samman Nidhi) పథకం కూడా ఒకటి. ఈ పథకానికి కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) నుంచి ఆధార్‌ నమోదును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌లో డబ్బులు పొందాలంటే లబ్దిదారుని ఈకేవైసీ తప్పనిసరి. ఈకేవైసీ పూర్తిచేయడానికి ముందుగా 31 మార్చి, 2022 వరకు గడువు ఉండగా, దానిని మే 31వ తేదీ వరకు పొడిగించింది. అయినా రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడంతో ఈ-కేవైసీ పూర్తి చేయడానికి జులై 31 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం కింద రైతు బ్యాంకు ఖాతాలో ఒక్కో విడత రూ.2 వేల చొప్పున ఆర్థిక సంవత్సరంలో 3 దఫాలుగా మొత్తం రూ.6 వేలు జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ఈ-కేవైసీ పూర్తి చేయడం ఎలా..?

☛ లబ్దిదారుడు ముందుగా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ని సంద‌ర్శించాలి.

ఇవి కూడా చదవండి

☛ తర్వాత ఈ-కేవైసీ ట్యాబ్‌ని క్లిక్ చేసి ఆధార్ కార్డు నంబ‌ర్‌ను నమోదు చేయాలి.

☛ సెర్చ్ ట్యాబ్‌పై క్లిక్ చేస్తే స్క్రీన్‌పై ‘ఎంట‌ర్ మొబైల్ నంబ‌ర్’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

☛ ఇక్కడ రిజిస్టర్‌ అయిన మొబైల్ నంబ‌రు ఎంట‌ర్ చేసి పక్కన ఉన్న ‘గెట్ ఓటీపీ’పై క్లిక్ చేయాలి.

☛ ఆ తర్వాత మీ మొబైల్ నంబ‌రుకు 4 అంకెల OTP వ‌స్తుంది. ఓటీపీని ఎంట‌ర్ చేసి స‌బ్మిట్‌పై క్లిక్ చేయాలి.

☛ ఇప్పుడు మళ్లీ ఆధార్ రిజిస్టర్డ్‌ ఓటీపీ అనే ఆప్షన్ వ‌స్తుంది. ఇందులో మీ ఆధార్ రిజిస్టర్డ్‌ మొబైల్ నంబ‌రుకు మ‌రొక ఓటీపీ వ‌స్తుంది. దీన్ని ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేస్తే ఈ-కేవైసీ పూర్తయినట్లే.

☛ ముఖ్యంగా ఈ పథకం నుంచి డబ్బులు పొందుతున్నవారు ఈ-కేవైసీ పూర్తి చేయాలంటే రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్‌ తప్పనిసరి. మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని తప్పనిసరిగా నమోదు చేస్తేనే మీ ఈకేవైసీ పూర్తవతుంది.

ఒక వేళ మీ మొబైల్‌ నంబర్‌ మారినట్లయితే ముందుగానే ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లి కొత్త నంబర్‌ను నమోదు చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కొత్త నంబరు ఆధార్‌కు అనుసంధానమైన తర్వాత పీఎం కిసాన్‌ పోర్టల్‌లో ఈ-కేవైసీ నమోదు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్