Digital Rupee: దేశంలో డిజిటల్ రూపాయిని ఎక్కడ?.. ఎలా పొందాలి?.. దీని ప్రయోజనాలు ఏంటో తెలుసా..
ఇప్పుడు చాలా నగరాల్లో డిజిటల్ రూపాయి అందుబాటులోకి వచ్చింది. దేశంలోని అనేక రకాల కొనుగోళ్ల కోసం మీరు డిజిటల్ రూపాయి (e₹-R)ని ఉపయోగించవచ్చు. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా మాత్రమే కొనుగోలు వీటిని కొనుగోలు చేయవచ్చు.

దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్వారా డిజిటల్ రూపాయిని పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించింది. ఆర్బీఐ ప్రారంభించిన డిజిటల్ రూపాయి (e₹-R) దేశంలోని దుకాణాల నుంచి అన్ని రకాల కొనుగోళ్లకు ఉపయోగించబడింది. ఈ డిజిటల్ రూపాయి చట్టబద్ధమైన టెండర్ కింద జారీ చేయబడింది. ఇది డిజిటల్ టోకెన్గా పని చేస్తుంది. దేశంలో e-RUPI సౌకర్యాన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అందిస్తోంది. ఇ-రూపాయి చెల్లింపు కోసం ఎన్పిసిఐ క్యూఆర్ కోడ్ను కూడా జారీ చేస్తోంది. ఈ ఏడాది నవంబర్ 1న హోల్సేల్ సెగ్మెంట్ కోసం ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపాయిని ప్రారంభించింది ఆర్బీఐ.
డిసెంబర్ 1 నుంచి రిటైల్ ఉపయోగం కోసం డిజిటల్ రూపాయి(ఈ-రూపాయి)ని విడుదల చేసింది. దేశంలోని బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, భువనేశ్వర్ వంటి నగరాలలో డిజిటల్ రూపాయి ఆచరణాత్మకంగా ఉనికిలోకి రాబోతుంది. రిటైల్ డిజిటల్ రూపాయి వ్యాపారంలో తొలుత ఎస్బీఐ , ఐసీఐసీఐ బ్యాంక్లతో సహా మొత్తం నాలుగు బ్యాంకులు పాల్గొంటాయని ఆర్బీఐ తెలిపింది. డిజిటల్ రూపాయి ప్రారంభదశలో బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, భువనేశ్వర్లలోని నిర్దిష్ట వినియోగదారులు, వ్యవస్థాపకుల సమూహంలో మాత్రమే పంపిణీలోకి రానుంది.
డిజిటల్ రూపాయి అంటే ఏంటి..?
డిజిటల్ రూపాయి లేదా ఇ-రూపాయి అనేది నోట్లు, నాణేల డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ రూపం. ఇ-రూపాయిని ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు మీరు నోట్లు లేదా నాణేలను ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు షాపింగ్ లేదా మరేదైనా లావాదేవీ కోసం ఈ ఇ-రూపాయిని ఉపయోగించవచ్చు. ఇందులో ఆన్లైన్ లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. డిజిటల్ రూపాయి బ్లాక్చెయిన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది.
ఇవి లావాదేవీలుగా ఉంటాయి
డిజిటల్ డబ్బుతో, మీరు వ్యక్తి నుండి వ్యక్తికి (P2P) , వ్యక్తి నుంచి వ్యాపారికి (P2M) లావాదేవీలు చేయవచ్చు. మీరు దీన్ని ఏ దుకాణంలోనైనా కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. మీరు దుకాణదారుడి QR కోడ్ని స్కాన్ చేసి, డిజిటల్ వాలెట్లో డిపాజిట్ చేసిన ఇ-రూపాయితో చెల్లించే ఎంపికను కూడా పొందుతారు.
దేశంలో ఎక్కడ పొందాలి
పైలట్ ప్రాజెక్ట్ 8 బ్యాంకులతో డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తీసుకురావడం గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సమాచారం ఇచ్చింది. ఇందులో మొదటి దశలో ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్లలో ఈ సౌకర్యం ప్రారంభమవుతుంది. రెండవ దశలో, అహ్మదాబాద్, గ్యాంగ్టక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా,సిమ్లాలలో డిజిటల్ రూపాయి అందుబాటులో ఉంటుంది.
ఈ బ్యాంకుల్లో డిజిటల్ రూపాయి అందుబాటులో ..
ఈ సదుపాయం మొదటి దశలో 4 బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ICICI బ్యాంక్ (ICICI బ్యాంక్), యెస్ బ్యాంక్ (YES బ్యాంక్), IDFC ఫస్ట్ బ్యాంక్ (IDFC బ్యాంక్) ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు. భువనేశ్వర్లలో అందుబాటులో ఉంటుంది. రెండవ దశలో, బ్యాంక్ ఆఫ్ బరోడా (BOI), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI), HDFC బ్యాంక్ (HDFC), కోటక్ మహీంద్రా బ్యాంక్ (కోటక్) ద్వారా డిజిటల్ రూపాయి అందుబాటులో ఉంటుంది.
ఈ విధంగా మీరు డిజిటల్ డబ్బును పొందవచ్చు
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంక్, యెస్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్ యాప్ లేదా వెబ్సైట్ నుండి డిజిటల్ రూపాయిని కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం ఖాతాదారుల మొబైల్ లేదా మరేదైనా డివైజ్లో డిజిటల్ వాలెట్ను బ్యాంకులు అందుబాటులో ఉంచుతాయి. కస్టమర్లు ఈ డిజిటల్ కరెన్సీని తమ బ్యాంక్ వాలెట్లో ఉంచుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం




