భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 700 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరకు సెన్సెక్స్‌ 636 పాయింట్లు జంప్‌ చేసి 37327వద్ద, నిఫ్టీ 176 పాయింట్లు ఎగిసి 11032 వద్ద స్థిర పడ్డాయి. కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతుస్థాయిలకు ఎగువన ముగిసాయి. బ్యాంక్‌, ఆటో, మెటల్‌, ఐటీ ఇలా అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిసాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, యస్‌బ్యాంకు, టాటా మోటార్స్‌, రిలయన్స్‌, ఎం అండ్‌ ఎం, హీరో మోటో, బజాజా్‌ […]

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2019 | 12:39 PM

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 700 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరకు సెన్సెక్స్‌ 636 పాయింట్లు జంప్‌ చేసి 37327వద్ద, నిఫ్టీ 176 పాయింట్లు ఎగిసి 11032 వద్ద స్థిర పడ్డాయి. కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతుస్థాయిలకు ఎగువన ముగిసాయి. బ్యాంక్‌, ఆటో, మెటల్‌, ఐటీ ఇలా అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిసాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, యస్‌బ్యాంకు, టాటా మోటార్స్‌, రిలయన్స్‌, ఎం అండ్‌ ఎం, హీరో మోటో, బజాజా్‌ ఆటో, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, మారుతి సుజుకి అపోలో టైర్స్‌ , అదానీ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్‌, అల్ట్రా టెక్‌ సిమెంట్‌ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.