AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

May New Rules: మే 1 నుంచి మారనున్న నిబంధనలు.. మీ జేబుపై మరింత భారం!

May Month New Rules: ఈ కొత్త నియమాల గురించి మీరు ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం. తద్వారా మీరు తరువాత ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఈ మార్పులు మీ లావాదేవీలు, సేవలను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఏటీఎం ఉపసంహరణ పరిమితి..

May New Rules: మే 1 నుంచి మారనున్న నిబంధనలు.. మీ జేబుపై మరింత భారం!
Subhash Goud
|

Updated on: Apr 30, 2025 | 5:08 PM

Share

మే 1 నుండి అనేక పెద్ద మార్పులు జరగబోతున్నాయి. ఇది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. బ్యాంకు ఖాతా నుండి ఎటిఎం లావాదేవీలు, వంట గ్యాస్ ధర వరకు ప్రతిదీ దానితో ముడిపడి ఉంది. అందువల్ల ఈ కొత్త నియమాల గురించి మీరు ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం. తద్వారా మీరు తరువాత ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఈ మార్పులు మీ లావాదేవీలు, సేవలను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఏటీఎం ఉపసంహరణ పరిమితి, బ్యాంక్ ఛార్జీలు, గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పులు వంటివి. ఈ మార్పుల గురించి తెలుసుకుందాం.

  1. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవడం ఖరీదైనది: మే 1, 2025 నుండి ఏటీఎం నుండి డబ్బు విత్‌డ్రా చేయడంపై ఉచిత లావాదేవీలపై పరిమితి ముగుస్తుంది. ఇప్పుడు మీరు ఏటీఎం నుండి డబ్బు తీసుకునే ప్రతిసారీ రూ.19 చెల్లించాలి. గతంలో ఈ రుసుము రూ. 17 ఉండేది. దీనితో పాటు, మీరు బ్యాలెన్స్ చెక్ చేస్తే, దీనికి కూడా రూ. 7 రుసుము చెల్లించాలి. అయితే గతంలో రుసుము రూ. 6 ఉండేది.
  2. రైల్వే టికెట్ బుకింగ్‌లో మార్పులు: మే 1, 2025 నుండి రైల్వే టిక్కెట్ బుకింగ్ నియమాలలో కొన్ని మార్పులు ఉంటాయి. ప్రయాణికులు కొత్త వ్యవస్థ ప్రకారం సిద్ధం కావాలి. ఇక నుంచి వెయిటింగ్ టిక్కెట్లు జనరల్ కోచ్‌లలో మాత్రమే చెల్లుతాయి. మీరు స్లీపర్ కోచ్‌లో వెయిటింగ్ టికెట్‌తో ప్రయాణించలేరు.
  3. RRB పథకం అమలు: దేశంలోని 11 రాష్ట్రాల్లో ‘వన్ స్టేట్ వన్ ఆర్‌ఆర్‌బి’ పథకం మే 1, 2025 నుండి అమలు చేయబడుతుంది. దీని అర్థం ప్రతి రాష్ట్రంలో అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కలిసి ఒక పెద్ద బ్యాంకుగా ఏర్పడతాయి. దీనివల్ల బ్యాంకింగ్ సేవలు మెరుగుపడతాయి. కస్టమర్లకు గతంలో కంటే ఎక్కువ సౌలభ్యం లభిస్తుంది. ఈ మార్పు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లలో అమలు అవుతాయి.
  4. ఎల్‌పిజి సిలిండర్ ధరలో మార్పు: ప్రతి నెలా మొదటి తేదీన ఎల్‌పిజి సిలిండర్ ధరలను సమీక్షిస్తారు. ఈసారి కూడా మే 1న గ్యాస్ సిలిండర్ ధరను సమీక్షిస్తారు. ఈ ధర మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
  5.  ఎఫ్‌డీ (FD), పొదుపు ఖాతా వడ్డీ రేట్లలో మార్పులు: మే 1 నుండి మీరు FD, సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లలో కూడా మార్పులను చూడవచ్చు. ఆర్బీఐ రెపో రేటును రెండుసార్లు తగ్గించిన తర్వాత చాలా బ్యాంకులు పొదుపు ఖాతాలు, ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను తగ్గించాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి