AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. ఈ లావాదేవీలపై ఛార్జీల మోత.. ఆగస్ట్‌ 15 నుంచి అమలు!

SBI:స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. మీరు రూ.25 వేలకు మించి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపించినట్లయితే ఇకపై ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఐఎంపీఎస్ (IMPS) ఛార్జీలను సవరిస్తూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది ఎస్‌బీఐ. అయితే సవరించిన ఈ కొత్త ఛార్జీలు ఆగస్ట్‌ 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది..

SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. ఈ లావాదేవీలపై ఛార్జీల మోత.. ఆగస్ట్‌ 15 నుంచి అమలు!
Subhash Goud
|

Updated on: Aug 13, 2025 | 9:33 PM

Share

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బ్యాంక్ కస్టమర్లు ఆగస్టు 15, 2025 నుండి ఆన్‌లైన్ IMPS బదిలీపై రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది గతంలో పూర్తిగా ఉచితం ఉండేది. ఇన్‌స్టంట్ మనీ పేమెంట్ సర్వీస్(IMPS) అనేది రియల్-టైమ్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్. దీని సహాయంతో ఎవరైనా తక్షణమే డబ్బును బదిలీ చేయవచ్చు. ఈ సేవ 24 గంటలు 365 రోజులు అందుబాటులో ఉంటుంది. అయితే ఇందులో కొన్నింటికి కొత్త ఛార్జీలు విధిస్తుండగా, కొన్నింటికి ఎలాంటి మార్పులు చేయలేదని బ్యాంక్ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Gold Price: జోరు తగ్గింది.. 2400 రూపాయలు తగ్గిన బంగారం ధర

IMPS ద్వారా ఒకేసారి గరిష్టంగా రూ.5 లక్షల వరకు బదిలీ చేయవచ్చు. SBI చేసిన మార్పు ఆన్‌లైన్ లావాదేవీలపై మాత్రమే వర్తిస్తుందని, కొన్ని స్లాబ్‌లలో నామమాత్రపు ఛార్జీలు ఉంటాయని బ్యాంకు తెలిపింది. అయితే ఈ ఛార్జీలు ఇప్పటికీ కొన్ని ఖాతాలపై విధించడం లేదు. ఏ స్లాబ్‌పై బ్యాంక్ ఎంత ఛార్జీ విధించిందో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

➦ రూ.25,001–రూ.1,00,000: రూ.2 + ప్రతి లావాదేవీకి GST

➦ రూ.1,00,001–రూ.2,00,000: రూ.6 +(GST)

➦ రూ.2,00,001–రూ.5,00,000: రూ.10 + (GST)

➦ ఇప్పటివరకు అన్ని ఆన్‌లైన్ IMPS లావాదేవీలు మొత్తంతో సంబంధం లేకుండా ఉచితంగా ఉండేవి.

ఈ లావాదేవీలలో మార్పులు లేవు:

SBI శాఖలలో చేసే IMPS బదిలీలకు రుసుములు అలాగే ఉంటాయి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. పంపిన మొత్తాన్ని బట్టి రూ.2 + GST నుండి రూ.20 + GST వరకు ఉంటాయి.

ఈ ఖాతాదారులకు మినహాయింపు

కొంతమంది కస్టమర్లు ఆన్‌లైన్ ఐఎంపీఎస్‌ కోసం అధిక మొత్తాలకు కూడా జీరో ఛార్జీలు ఉంటాయని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఇందులో రక్షణ, పారా-మిలిటరీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర ప్రభుత్వం, పోలీసు, రైల్వే ఉద్యోగులకు మినహయింపు ఇచ్చింది.

ఈ మార్పు ఎందుకు?

బ్యాంక్ ప్రకారం.. ఈ నిర్ణయం ఎస్‌బీఐ ఆన్‌లైన్ IMPS ఛార్జీలను పరిశ్రమ నిబంధనలకు అనుగుణంగా మార్చింది. అదే సమయంలో రోజువారీ తక్కువ-విలువ కలిగిన బదిలీలు మెజారిటీ కస్టమర్లకు ఉచితంగా ఉండేలా చేసింది.

ఇది కూడా చదవండి: BSNL Best Plan: అతి తక్కువ ధరల్లోనే 365 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?
అప్పుడు వద్దన్నాడు.. తర్వాత హీరోగా సినిమా తీశాడు..
అప్పుడు వద్దన్నాడు.. తర్వాత హీరోగా సినిమా తీశాడు..
వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త
వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త
ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా
ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా
5 కేజీల సిలిండర్లు వచ్చేశాయి.. నేరుగా వెళ్లి తీసేసుకోవడమే..
5 కేజీల సిలిండర్లు వచ్చేశాయి.. నేరుగా వెళ్లి తీసేసుకోవడమే..
అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
పురుగుల మందు తాగిన మహిళా సర్పంచ్.. ఆస్పత్రికి‌ తరలిస్తుండగా..
పురుగుల మందు తాగిన మహిళా సర్పంచ్.. ఆస్పత్రికి‌ తరలిస్తుండగా..