AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Employers: దేశంలో అత్యధికంగా మహిళా ఉద్యోగులు ఉన్న కంపెనీలు ఏవి?

భారతదేశంలో రకరకాల కంపెనీలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఉద్యోగులున్నారు. ఇక టీసీఎస్‌ దేశంలో అత్యధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులను కలిగి ఉంది. ఇక్కడ దేశంలో ఆయా..

Women Employers: దేశంలో అత్యధికంగా మహిళా ఉద్యోగులు ఉన్న కంపెనీలు ఏవి?
Women Employers
Subhash Goud
|

Updated on: Dec 06, 2022 | 7:15 PM

Share

భారతదేశంలో రకరకాల కంపెనీలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఉద్యోగులున్నారు. ఇక టీసీఎస్‌ దేశంలో అత్యధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులను కలిగి ఉంది. ఇక్కడ దేశంలో ఆయా కంపెనీల్లో ఎక్కువ మంది మహిళలున్న జాబితా ఇక్కడ ఉంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) దేశంలో మంచి కంపెనీగా పేరుంది. ఈ సంస్థ దాదాపు 46 దేశాల్లోని 150 ప్రాంతాల్లో పని చేస్తోంది. టీసీఎస్‌ దేశంలోని ఇతర కంపెనీల కంటే ఎక్కువ మంది మహిళా కార్మికులను నియమించింది. బుర్గుండి ప్రైవేట్, హురున్ ఇండియా నిర్వహించిన సర్వేలో ఎక్కువ మంది మహిళలున్న కంపెనీల జాబితా బయటపడింది. అయితే టీసిఎస్ కాకుండా అనేక ఇతర కంపెనీలు ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మదర్‌సన్ సుమీ సిస్టమ్స్, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, పేజ్ ఇండస్ట్రీస్ జాబితాలో టాప్ 10 కంపెనీలు ఉన్నాయి.

ఈ జాబితాలో టీసీఎస్ అగ్రస్థానంలో ఉంది. బుర్గుండి ప్రైవేట్‌ లిమిటెడ్‌, హురున్‌ ఇండియా సంస్థలు జరిపిన సర్వే ప్రకారం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వర్క్‌ఫోర్స్‌లో 5,92,195 మంది ఉద్యోగులలో 2,10,000తో 35 శాతం వరకు మహిళలు ఉన్నారు . ఐటీ కంపెనీల్లో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించింది టీసీఎస్ అని సర్వేలో తేలింది. అత్యధిక సంఖ్యలో మహిళా కార్మికులు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్,రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇన్ఫోసిస్‌లో దాదాపు 1.25 లక్షల మంది మహిళలు పనిచేస్తున్నారు. విప్రోలో 88,946 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. మరియు 62,780 మరియు 62,560 మంది వ్యక్తులు వరుసగా హెచ్‌సీఎల్‌, రిలయన్స్‌లో పనిచేస్తున్నారు.

మదర్సన్ సుమీ సిస్టమ్స్ 52,501, టెక్ మహీంద్రా 42,774, ఐసిఐసిఐ బ్యాంక్ 32,774, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 22,750, పేజ్ ఇండస్ట్రీస్ 22,631 మంది మహిళా ఉద్యోగులతో టాప్ టెన్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. మహిళా ఉద్యోగుల సంఖ్య పరంగా టెక్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, పేజ్ ఇండస్ట్రీస్ తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. హెచ్‌సిఎల్, రిలయన్స్, మదర్‌సన్ సుమీ మునుపటి కంటే మెరుగ్గా ఉన్నాయి. అయితే ఐసీఐసీఐ బ్యాంక్‌ పరిస్థితి దిగజారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి