Attention taxpayers!: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్..! కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్టల్ను ప్రారంభించనున్న ఐటీ శాఖ
Attention taxpayers: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నుల దాఖలును మరింత ఈజీ చేసేందుకు కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్టల్ను ప్రారంభించనున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు . ఈ ఏడాది జూన్ 1 నుంచి 6వ తేది వరకు ప్రస్తుతం ఉన్న వెబ్ పోర్టల్ పనిచేయదని,
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నుల దాఖలును మరింత ఈజీ చేసేందుకు కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్టల్ను ప్రారంభించనున్నట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి 6వ తేది వరకు ప్రస్తుతం ఉన్న వెబ్ పోర్టల్ పనిచేయదని తెలిపింది. పన్ను చెల్లింపుదారుల కోసం జూన్ 7వ తేది నాటికి కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది.
పాత పోర్టల్ .. www.incometaxindiaefiling.gov.in నుంచి కొత్త పోర్టల్.. www.incometaxgov.in కు మార్పులతో అందుబాటులోకి రానుంది. జూన్7 నుంచి కొత్త పోర్టల్ అందుబాటులోకి వస్తుందని సిస్టమ్స్ విభాగం ఉత్తర్వులలో పేర్కొంది. జూన్ 1 నుంచి 6వ తేది వరకు కొత్తపోర్టల్తో పాటు పాత పోర్టల్ కూడా.. అటు పన్నుచెల్లింపుదారులకు, ఇటు ఆదాయపు పన్ను అధికారులకు అందుబాటులో ఉండదని పేర్కొంది. అందువల్ల ఈ ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోవాలని కోరింది.
పన్ను చెల్లింపుదారులకు, డిపార్మెంట్ అసెస్సింగ్ ఆఫీసర్ మధ్య ఇప్పటికే షెడ్యూల్ చేసిన పనులను వాయిదా వేసే అవకాశం ఉందన్నాని తెలిపింది. పన్ను చెల్లింపుదారులు కొత్త పోర్టల్కు అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి. జూన్ 10వ తేది తరవాతకు వీటిని వాయిదా వేసుకోవాలని సూచించింది.
వ్యక్తిగత లేదా బిజినెస్ కేటగిరికి సంబంధించి పన్ను రిటర్నులను(ITR)ను ఫైల్ చేసేందుకు, పన్ను వాపసుల విషయంలో తలెత్తే సమస్యలను, ఆదాయపు పన్నుకు సంబంధించి ఇతర పనుల కోసం పన్నుచెల్లింపుదారులు ఇ-ఫైల్లింగ్ పోర్టల్ను ఉపయోగిస్తారు.