Pension Plan: ఎన్పీఎస్ 2.0 వచ్చేస్తోంది.. కొత్త వెర్షన్లో మరిన్ని ప్రయోజనాలు.. అధిక రాబడి..
ప్రస్తుతం ఉన్న ఎన్పీఎస్ స్కీమ్ ను అప్ గ్రేడ్ చేస్తున్నారు. మరిన్ని సదుపాయాలు, అధిక రాబడి పెట్టుబడి దారులకు వచ్చేలా కొత్త వెర్షన్ ను తీసుకొస్తున్నారు. ఈ మేరకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్డిఏ) సన్నాహాలు చేస్తోంది. ఇది పెట్టుబడిదారులకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కొత్త వెర్షన్ నేషనల్ పెన్షన్స్ స్కీమ్ (ఎన్పీఎస్) పెట్టుబడిదారులు తమ పెట్టుబడిలో 50 శాతాన్ని ఈక్విటీ ఫండ్స్లో పెట్టడానికి అనుమతిస్తుంది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పెన్షన్ పథకాలలో నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) ఒకటి. పదవీ విరమణ తర్వాత రెగ్యూలర్ ఆదాయం కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా ఉంటోంది. పైగా ప్రభుత్వం మద్దతు కూడా ఉండటంతో వీటిల్లో అధికంగా పెట్టుబడుతున్నారు. మీరు కూడా దీనిలో పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉంటే మీకో శుభవార్త. ప్రస్తుతం ఉన్న ఎన్పీఎస్ స్కీమ్ ను అప్ గ్రేడ్ చేస్తున్నారు. మరిన్ని సదుపాయాలు, అధిక రాబడి పెట్టుబడి దారులకు వచ్చేలా కొత్త వెర్షన్ ను తీసుకొస్తున్నారు. ఈ మేరకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్డిఏ) సన్నాహాలు చేస్తోంది. ఇది పెట్టుబడిదారులకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కొత్త వెర్షన్ నేషనల్ పెన్షన్స్ స్కీమ్ (ఎన్పీఎస్) పెట్టుబడిదారులు తమ పెట్టుబడిలో 50 శాతాన్ని ఈక్విటీ ఫండ్స్లో వారి వయసు 45కి చేరుకునే వరకు నిలుపుకోవడానికి అనుమతిస్తుంది. తద్వారా పదవీ విరమణ సమయంలో ప్రజలకు మరింత డబ్బును అందిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఎన్పీఎస్ సిస్టమ్ స్థానంలో ఈ కొత్త వెర్షన్ ను త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు.
కొత్త వెర్షన్ లో ఏముందంటే..
నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) కొత్త వెర్షన్లో, భారత ప్రభుత్వం ‘న్యూ బ్యాలెన్స్డ్ లైఫ్ సైకిల్ ఫండ్’ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇది యువతను కూడా ఆకర్షిస్తుంది. ఈ కొత్త పథకం పదవీ విరమణ వరకు కార్పస్ను రూపొందించడంలో ప్రజలకు సహాయపడుతుంది. పీఎఫ్ఆర్డీఏ ప్రతిపాదించిన ఈ కొత్త పథకం ప్రకారం ఎక్కువ కాలం పాటు ఈక్విటీ ఫండ్లకు ఎక్కువ పెట్టుబడి మొత్తాలను కేటాయించవచ్చు. ప్రతిపాదిత పథకం మార్కెట్ నుంచి మరింత రాబడిని పొందడానికి, ఈక్విటీలో పెట్టుబడిని మరో పదేళ్లపాటు కొనసాగించే అవకాశం ఏర్పడుతుంది.
న్యూ ఢిల్లీలో అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) కోసం వార్షిక ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ సందర్భంగా పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ దీపక్ మొహంతి, ఎన్పీఎస్ బ్యాలెన్స్ లైఫ్సైకిల్ పథకాన్ని జూలై లేదా ఆగస్టులో ప్రవేశపెట్టవచ్చని సూచనప్రాయంగా మీడియాకు తెలియజెప్పారు. ఈక్విటీ కేటాయింపు గరిష్టంగా 50% వరకు ఉండే ఆటో-ఛాయిస్లో ఫండ్ అదనపు ఎంపికగా ఉంటుంది. అయితే 45 సంవత్సరాల వయస్సు తర్వాత మాత్రమే ఇది ప్రారంభమవుతుంది. ఇది సబ్స్క్రైబర్లు తమ రిటైర్మెంట్ ఫండ్లో మరింత కార్పస్ను కూడబెట్టుకోవడానికి సహాయపడుతుంది.
అటల్ పెన్షన్ యోజన వైపు జనాల మొగ్గు..
ఈ పథకం కొత్త వెర్షన్ చాలా కాలం పాటు ఈక్విటీ ఫండ్స్లో ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుందని దీపక్ మొహంతి చెప్పారు. అంతేకాక ఆయన అటల్ పెన్షన్ యోజన గురించి కూడా ప్రస్తావించారు. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో దాదాపు 1.22 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లు అటల్ పెన్షన్ యోజనలో చేరారని వెల్లడించారు. పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా ఇదే అత్యధిక సంఖ్య అని.. 2024 నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని కూడా ఆయన చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..