AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heavy Rain Alert: రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు.. అధికారుల కీలక ప్రకటన

Heavy Rain Alert: కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. దీని కారణంగా ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. జూలై 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా అడపాదడపా వర్షాలు కొనసాగవచ్చు. వార్తా సంస్థ PTI ప్రకారం.. జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారి తెలిపారు..

Heavy Rain Alert: రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు.. అధికారుల కీలక ప్రకటన
Subhash Goud
|

Updated on: Jul 13, 2025 | 7:09 PM

Share

దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు మరింత బలపడుతున్నాయి. భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీని వల్ల వేడి నుండి ఉపశమనం కలిగింది. అయితే నీరు నిలిచిపోవడం, కొండచరియలు విరిగిపడటం, వరదల వంటి పరిస్థితులు, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తాయి. రాబోయే రోజుల్లో అనేక రాష్ట్రాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన గాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవవచ్చని తెలిపింది. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, మైదాన ప్రాంతాల్లో వరదల వంటి పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: SBI Credit Card: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఉందా? మీకో బిగ్‌ షాక్‌.. జూలై 15 నుంచి అమలు!

IMD ప్రకారం.. రాబోయే 24 గంటల్లో ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సౌరాష్ట్ర కచ్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, తీరప్రాంత కర్ణాటక, ఉత్తర కేరళ, ఒడిశా, జార్ఖండ్, దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 3 రోజుల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర గుజరాత్‌లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Sanchar Saathi: మీ మొబైల్‌ పోయిందా? నో టెన్షన్‌.. ఈ ప్రభుత్వ యాప్‌ ద్వారా సులభంగా గుర్తించవచ్చు!

జూలై 12, శనివారం దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలు మేఘావృతమై ఉండి వర్షం కురిశాయి. దీని కారణంగా భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం ఢిల్లీలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూలై 18 వరకు దేశ రాజధానిలో నిరంతర వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. నగరంలో వారమంతా తేలికపాటి వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. ఢిల్లీ-NCR కాకుండా పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సహా అనేక ఇతర ఉత్తర రాష్ట్రాలు కూడా రాబోయే కొన్ని రోజులు తేలికపాటి నుండి మితమైన వర్షాలు కురువనున్నాయి.

జూలై 13 నుండి 15 వరకు జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష హెచ్చరిక

జూలై 13 నుండి 15 వరకు జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. దీని కారణంగా ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. జూలై 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా అడపాదడపా వర్షాలు కొనసాగవచ్చు. వార్తా సంస్థ PTI ప్రకారం, జూలై 13న లతేహార్, లోహర్దగా, సరైకేలా-ఖర్సవాన్, తూర్పు, పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాల కొన్ని ప్రాంతాలకు, జూలై 14న పలము, చత్ర, లతేహార్, లోహర్దగా, హజారిబాగ్, కోడెర్మా, గిరిదిహ్, డియోఘర్, సరైకేలా-ఖర్సవాన్, తూర్పు, పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: Fact Check: సెప్టెంబర్‌ నాటికి రూ.500 నోట్లు నిలిచిపోనున్నాయా? ప్రభుత్వం కీలక ప్రకటన

ఇది కూడా చదవండి: Bank Holidays: వచ్చే రెండు వారాల్లో 6 రోజులు బ్యాంకులు బంద్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి