AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: సెప్టెంబర్‌ నాటికి రూ.500 నోట్లు నిలిచిపోనున్నాయా? ప్రభుత్వం కీలక ప్రకటన

Fact Check: సెప్టెంబర్‌ 2025 నాటికి 500 రూపాయల నోట్లు నిలిచిపోనున్నాయా? కేంద్ర ప్రభుత్వం త్వరలో ఇలాంటి పెద్ద నోట్లను తొలగించేందుకు సిద్ధమవుతోందా? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజమేనా? ఇలాంటి సమాచారం ప్రజలను కలవరపెడుతోంది. ఇప్పటికే 2000 రూపాయల నోట్లను నిలిపివేసి మార్కెట్లో ఉన్న మిగిలినా నోట్లను వెనక్కి ఇవ్వాలని సూచిస్తోంది ఆర్బీఐ..

Fact Check: సెప్టెంబర్‌ నాటికి రూ.500 నోట్లు నిలిచిపోనున్నాయా? ప్రభుత్వం కీలక ప్రకటన
Subhash Goud
|

Updated on: Jul 13, 2025 | 6:18 PM

Share

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ ఎక్కువగా వైరల్‌ అవుతున్నాయి. అమాయకులను మోసగించేందుకు సైబర్‌ నేరగాళ్లు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి నకిలీ సమాచారం నమ్మి చాలా మంది మోసపోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే సోషల్‌ మీడియాలో వచ్చేవి అన్ని నమ్మకూడదని సూచిస్తున్నారు అధికారులు. సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా బ్యాంకు అకౌంట్లపై కన్నేసి ఉంచుతారు. లేనిపోని సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ బ్యాంకు అకౌంట్లను లూటీ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఓ సమాచారం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఇది కూడా చదవండి: Sanchar Saathi: మీ మొబైల్‌ పోయిందా? నో టెన్షన్‌.. ఈ ప్రభుత్వ యాప్‌ ద్వారా సులభంగా గుర్తించవచ్చు!

ఇవి కూడా చదవండి

అదే 500 రూపాయల నోట్లపై. ప్రస్తుతం చెలామణిలో ఉన్న 500 రూపాయల నోట్లు సెప్టెంబర్‌ నాటికి నిలిపివేయాలని బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) ఆదేశాలు జారీ చేసినట్లు నకిలీ వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎలాంటి నిజం లేదని, వీటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని హెచ్చరిస్తోంది.

వాట్సాప్‌ ద్వారా, ఇతర సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సమాచారం తప్పుడు ప్రచారం అని ఖండించింది. ఇలాంటి సమాచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా సూచిస్తూ పీఐబీ ‘ఫ్యాక్ట్‌చెక్‌’(PIB Fact Check) విభాగం ‘ఎక్స్‌’ ద్వారా సమాచారం అందించింది. రూ.500 నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది. ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరింది. ఇలాంటి వార్తలు ప్రతి రోజు వాట్సాప్‌, ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ద్వారా వైరల్ అవుతున్నాయని, వాటిని నమ్మకూడదని తెలిపింది.

ఇది కూడా చదవండి: Bank Holidays: వచ్చే రెండు వారాల్లో 6 రోజులు బ్యాంకులు బంద్‌

500 రూపాయల నోట్లు నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఫ్యాక్ట్‌చెక్‌ ద్వారా తెలిపింది. అయితే ఏటీఎంలలో చిన్న నోట్లు రూ.100,200 నోట్ల లభ్యతను పెంచాలని ఆదేశాలు ఉన్నాయి తప్ప ఈ పెద్ద నోట్లను రద్దు చేయడం గానీ, ఏటీఎంలలో నిలిపివేయడం గానీ ఉండదని తెలిపింది. రూ.500 నోట్ల ద్వారా సామాన్యులకు చిల్లర విషయంలో ఇబ్బందులు ఉన్నాయని, ఏటీఎంలలో చిన్న నోట్లు అయిన 100, 200 రూపాయలను పెంచినట్లయితే ఇబ్బంది ఉండదని తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.