భారతదేశంలో పెరుగుతున్న ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాదారులను ఆకట్టుకునేందుకు బ్యాంకులు తాజా ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద బ్యాంకులకు పోటీగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ (ఎన్ఈఎస్ఎఫ్బీ) తన ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను ఇటీవల 9.75%కి పెంచింది. ఇది ఎఫ్డీలపై దేశంలోనే అత్యధిక వడ్డీ రేటు అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రేటు 50 బేసిస్ పాయింట్ల పెరుగుదల దాని కస్టమర్లకు అత్యంత విలువైన రాబడిని అందిస్తుంది. ఎన్ఈఎస్ఎఫ్బీ సాధారణ ప్రజలకు 9.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 9.75 శాతం రేట్లను అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్ఈఎస్ఎఫ్బీ తాజా వడ్డీ రేట్ల గురించి మరిన్న వివరాలను తెలుసుకుందాం.
ఎన్ఈఎస్ఎఫ్బీ సవరించిన ఎఫ్డీ రేట్లు బ్యాంకింగ్ రంగంలో అత్యధిక రేట్లుగా ఘనతను సాధించాయి. ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లలో ఈ పెరుగుదల కస్టమర్లకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు వారి ఎఫ్డీలపై ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని సంపాదించే సామర్థ్యాన్ని అందిస్తుంది . ఎఫ్డీలకు సంబంధించిన అధిక లిక్విడిటీ, సులభమైన ఎన్క్యాష్బిలీటీ కారణంగా మనీ మార్కెట్ పోలిస్తే మెరుగైన రాబడితో పాటు ఈ డిపాజిట్ల నుండి వచ్చే వడ్డీ నికరమైన ఆదాయాన్ని ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్ల పెంపు గురించి నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సతీష్ కుమార్ కల్రా మాట్లాడుతూ పెరిగిన వడ్డీ రేట్లు వినియోగదారులకు వివిధ ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను అందించడానికి ఉద్దేశించి రూపొందించామని వివరించారు. వడ్డీ రేట్లను సవరించడం ద్వారా రిసోర్స్ మేనేజ్మెంట్లో సమర్థవంతంగా ఉంటూనే బ్యాంక్ తన కస్టమర్లకు పోటీతత్వ రాబడిని అందిస్తుందని పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..