AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వారి కోసం ప్రత్యేక ఫుడ్‌ కౌంటర్ల ఏర్పాటు!

ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. ప్రయాణికులు ఇబ్బందులకు గురవకుండా మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తోంది రైల్వే. అయితే ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం తీసుకుందని ఇండియన్‌ రైల్వే. తక్కువ ధరల్లోనే ప్రయాణికులకు..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వారి కోసం ప్రత్యేక ఫుడ్‌ కౌంటర్ల ఏర్పాటు!
Indian Railways
Subhash Goud
|

Updated on: Jul 19, 2023 | 10:53 PM

Share

ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. ప్రయాణికులు ఇబ్బందులకు గురవకుండా మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తోంది రైల్వే. అయితే ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం తీసుకుందని ఇండియన్‌ రైల్వే. తక్కువ ధరల్లోనే ప్రయాణికులకు ఫుడ్‌, నీటి సదుపాయం కల్పించే దిశగా నిర్ణయం తీసుకుంది. జనరల్‌ కోచ్‌ల్లో ప్రయాణించే వారి కోసం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రైలు ఆయా స్టేషన్‌లలో నిలిపే చోట ప్లాట్‌ఫామ్‌పై ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచనున్నట్లు భారత రైల్వే తెలిపింది.

అయితే జనరల్‌ కోచ్‌ ఆహార పదార్థాలను రెండు కేటగిరిలుగా విభజించింది. 7 పూరీలు, ఆలూ ఫ్రై, అవకాయ పికిల్‌తో కూడిన ప్యాక్‌ను కేవలం 20 రూపాయలకే అందించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక రెండో కేటగిరి విషయానికొస్తే ఫుడ్‌ను 50 రూపాయలకు అందించనుంది. ఈ ఫుడ్‌ ప్యాక్‌లో అన్నం, కిచిడీ, రాజ్మా, పావ్‌ బాజీ, దోశ వంటివి ఉంటాయి. అయితే ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్‌ చేసుకోవచ్చు. ఇందులో వాటర్‌ బాటిల్‌ కూడా ఉంటుంది. అయితే తక్కువ ధరల్లోనే ప్రయాణికులకు ఆహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన కౌంటర్లను ఏర్పాటు చేయనుంది. జనరల్‌ కోచ్‌లు ఉన్న రైళ్లలో రిజర్వేషన్‌ చేసుకోలేని వారు ప్రయాణిస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ సదుపాయాన్ని అందించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ముందుగా ఈ సేవలను ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సేవలు 51 రైల్వే స్టేషన్‌లలో ఏర్పాటు చేసింది రైల్వే. రానున్న రోజుల్లో మరిన్ని స్టేషన్‌లలో ఈ సేవలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది రైల్వే.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా మారిన విండోస్‌ 11సమస్య.. ఏంటది?
వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా మారిన విండోస్‌ 11సమస్య.. ఏంటది?
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు