AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST on Warranty Products: కస్టమర్లకు శుభవార్త.. వారంటీ వ్యవధిలో వస్తువును మరమ్మతు చేస్తే పన్ను ఉండదు

సాధారణంగా కంపెనీలు కొత్త ఉత్పత్తులపై తక్కువ వ్యవధిలో వారంటీ ఇస్తాయి. ఏదైనా వస్తువు కొనుగోలు చేసిన తర్వాత వాటికి వారంటీ ఉంటుంది. వారంటీ అంటే కంపెనీ ఉత్పత్తిలో ఏదైనా లోపం ఉంటే కంపెనీ ఇచ్చిన వారంటీ సమయంలో దానిని రిపేర్ చేస్తుంది. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న..

GST on Warranty Products: కస్టమర్లకు శుభవార్త.. వారంటీ వ్యవధిలో వస్తువును మరమ్మతు చేస్తే పన్ను ఉండదు
Gst On Warranty Products
Subhash Goud
|

Updated on: Jul 20, 2023 | 5:00 AM

Share

సాధారణంగా కంపెనీలు కొత్త ఉత్పత్తులపై తక్కువ వ్యవధిలో వారంటీ ఇస్తాయి. ఏదైనా వస్తువు కొనుగోలు చేసిన తర్వాత వాటికి వారంటీ ఉంటుంది. వారంటీ అంటే కంపెనీ ఉత్పత్తిలో ఏదైనా లోపం ఉంటే కంపెనీ ఇచ్చిన వారంటీ సమయంలో దానిని రిపేర్ చేస్తుంది. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుంది. మీరు కొత్త ఉత్పత్తిని కొనుగోలు చేసి తక్కువ సమయంలోనే ఏదైనా రిపేరుకు రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు.

వాస్తవానికి ఇలాంటి అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. కంపెనీలు వారంటీ ఉత్పత్తిని రిపేర్ చేసి కస్టమర్‌కు తిరిగి ఇచ్చేవి. అయితే కంపెనీ కస్టమర్ నుంచి సేవా పన్ను అంటే GST వసూలు చేస్తుంది. ఇప్పుడు కంపెనీలు ఏదైనా వారంటీ సమయంలో రీపేరు చేసినట్లయితే కస్టమర్‌ నుంచి ఎలాంటి జీఎస్టీ వసూలు చేయలేవు. వారంటీ కింద ఉత్పత్తిని రిపేర్ చేయడానికి విడిభాగాలను మార్చడానికి కంపెనీలు వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేవని ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టం చేసింది.

జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది

ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలు ఎలాంటి ఛార్జీలు లేకుండా వారంటీ కింద ఉత్పత్తుల విడిభాగాలను భర్తీ చేస్తున్నట్లయితే అటువంటి సందర్భాలలో వారు జీఎస్టీని వసూలు చేయలేరని జీఎస్టీ కౌన్సిల్ ఇటీవలి సమావేశంలో స్పష్టం చేసింది. ఇప్పుడు కౌన్సిల్ నిర్ణయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ) నోటిఫై చేసింది. సీబీఐసీ ఇటీవలి ఆర్డర్‌లో వారంటీ ఉత్పత్తులలో విడిభాగాల భర్తీకి సంబంధించిన పూర్తి ధర ఇప్పటికే అసలు ఉత్పత్తిని విక్రయించేటప్పుడు కస్టమర్ నుంచి వసూలు చేయడం జరుగుతుంది. వారంటీ వ్యవధిలో సంబంధిత ఉత్పత్తిని రిపేర్ చేయడానికి అవసరమైతే కంపెనీలు స్వయంగా విడిభాగాలను భర్తీ చేయాలి. అటువంటి పరిస్థితిలో కంపెనీలు జీఎస్టీ పేరుతో వినియోగదారుల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయలేవు.

ఇవి కూడా చదవండి

విడిభాగాల రీప్లేస్‌మెంట్ కోసం కంపెనీ ఏదైనా అదనపు రీప్లేస్‌మెంట్ ఛార్జీ లేదా సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తే జీఎస్టీ వర్తించవచ్చని సీబీఐసీ తెలిపింది. సీబీఐసీ ఈ ఆర్డర్ దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. అప్పుడు కంపెనీలు వాటి సర్వీస్ సెంటర్లు చేసే తప్పులు కూడా నియంత్రణలో ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట