AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Price Today: మహిళలకు షాకిస్తున్న బంగారం వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. దీపావళి సమయంలో మరింత పెరుగుతోంది. నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు మాత్రం స్వల్పంగా.

Gold Silver Price Today: మహిళలకు షాకిస్తున్న బంగారం వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Gold Price
Subhash Goud
|

Updated on: Oct 24, 2022 | 6:34 AM

Share

దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. దీపావళి సమయంలో మరింత పెరుగుతోంది. నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు మాత్రం స్వల్పంగా పెరిగింది. మంగళవారం ధన్‌తేరాజ్‌. ఈ సందర్భంగా ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. బంగారం రేట్లు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక తాజాగా అక్టోబర్‌ 24న దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450 ఉంది.

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,290 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,680 ఉంది.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,720 వద్ద ఉంది.

☛ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,290 వద్ద ఉంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,290 వద్ద ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,340 ఉంది.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,290 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక బంగారం ధర పెరిగితే.. వెండి మాత్రం స్థిరంగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర ఇలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.57,700 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.63,200 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.63,200 ఉండగా, చెన్నైలో రూ.63,200 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.57,700 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.63,200 ఉంది. ఇక కేరళలో రూ.63,200 వద్ద కొనసాగుతోంది. కాగా, దేశంలోని ఇతర నగరాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం రేట్లలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చునని గమనించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి