AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..

పసిడి కొనుగోలుదారుల ఆశలకు అడ్డుతగులుతోంది నేటి ధర. బంగారం, వెండి ధరల్లో ఈరోజు కొంత పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రదాన కారణం. దీంతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల తగ్గుదలకు కారణం అవుతోంది.

Gold Price: వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
Gold Price Today
Srikar T
|

Updated on: Feb 02, 2024 | 2:04 PM

Share

పసిడి కొనుగోలుదారుల ఆశలకు అడ్డుతగులుతోంది నేటి ధర. బంగారం, వెండి ధరల్లో ఈరోజు కొంత పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రదాన కారణం. దీంతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల తగ్గుదలకు కారణం అవుతోంది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 62,950 కాగా ఈరోజు రూ. 100 పెరిగి రూ. 63,050గా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,700 ఉండగా ఈరోజు రూ.57,800 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 100 పెరుగుదల కనిపించింది. ఇక వెండి విషయానికొస్తే నిన్నటి ధరలతో పోలిస్తే కిలోపై రూ.200 పెరిగింది. నిన్న కిలో వెండి ధర రూ. 77,200 కాగా ఈరోజు రూ. 77,000 కు చేరింది. అంటే కిలోపై రూ.100 తగ్గింది. ఇక హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 63,050
  • విజయవాడ..రూ. 63,050
  • ముంబాయి..రూ. 63,050
  • బెంగళూరు..రూ. 63,050
  • చెన్నై..రూ. 63,550

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 57,800
  • విజయవాడ..రూ. 57,800
  • ముంబాయి..రూ. 57,800
  • బెంగళూరు..రూ. 57,800
  • చెన్నై..రూ. 58,250

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్..రూ. 77,000
  • విజయవాడ..రూ. 77,000
  • చెన్నై..రూ. 77,000
  • ముంబాయి..రూ. 75,500
  • బెంగళూరు..రూ. 73,250

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..