Fuel Price Today: వాహనదారులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే..?

Latest Petrol Diesel Prices: పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే నిత్యావసర

Fuel Price Today: వాహనదారులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే..?
Follow us

|

Updated on: Oct 28, 2021 | 7:43 AM

Latest Petrol Diesel Prices: పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో పాటు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా మండిపోతుండంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా గురువారం కూడా చమురు ధరలను మరోసారి పెంచుతూ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతున్న ధరలను తగ్గించాలని వాహనదారులు కోరుతున్నప్పటికీ.. పెరగడం మాత్రం ఆగడం లేదు. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు గురువారం లీటరు పెట్రోల్‌‌పై 36, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెంచాయి. దీంతో దేశంలో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. అయితే.. వరుసగా.. ఇప్పటివరకు 20కిపైగా సార్లు ధరలు పెరుగుతూ వచ్చాయి.

మెట్రలో నగరాల్లో ధరలు.. దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.108.29, డీజిల్‌ ధర రూ.97.02 కి పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ రూ.114.14, డీజిల్‌ రూ.105.12 కి చేరింది. చెన్నైలో పెట్రోల్‌ రూ.105.13 కి చేరగా.. డీజిల్‌ రూ.101.25 కి పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.108.78 కి పెరగగా.. డీజిల్‌ రూ.100.14 కి చేరింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.112.64 కి చేరగా.. డీజిల్‌ ధర రూ.105.84కి పెరిగింది. ఏపీలోని విజయవాడలో పెట్రోల్ ధర 114.48కి చేరగా.. డీజిల్ ధర 107కి ఎగబాకింది.

దేశీయ పెట్రోలియం సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తాయి. దీనిలో భాగంగా.. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటాయి.

Also Read:

Crime News: అప్పుడు భార్యను దారుణంగా చంపాడు.. ఇప్పుడు అనుభవిస్తున్నాడు.. అసలేమైందంటే..?

Aryan Khan: ఆర్యన్‌ బెయిల్‌పై కొనసాగుతున్న సస్పెన్స్‌.. పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..