AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Trains: విదేశాల్లోనూ పరుగులు పెట్టనున్న వందే భారత్ రైళ్లు.. అతి త్వరలోనే..

బీఈఎంఎల్ ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ రైలు మొదటి నమూనాను తయారు చేసే పనిలో ఉంటుంది. కొన్ని నెలల్లో రైలును తయారు చేసి ఆవిష్కరించనుంది. ఆ తర్వాత కంపెనీ అనేక ప్రణాళికలు రూపొందించుకుంది. మిడిల్ ఈస్ట్, దక్షిణ అమెరికా, ఆసియా దేశాలకు వందే భారత్ రైళ్లను ఎగుమతి చేయాలని భావిస్తోంది.

Vande Bharat Trains: విదేశాల్లోనూ పరుగులు పెట్టనున్న వందే భారత్ రైళ్లు.. అతి త్వరలోనే..
Vande Bharat
Madhu
|

Updated on: Aug 16, 2024 | 5:14 PM

Share

సాంకేతికతకు మారుపేరుగా జపాన్, చైనా, అమెరికా వంటి దేశాలను చెప్పుకుంటాం. ప్రపంచంలోని అన్ని దేశాలకు వాటి నుంచి అనేక వస్తువులు ఎగుమతి అవుతాయి. ఇప్పుడు వాటితో మన దేశం కూడా పోటీ పడుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని భారీ పరికరాల తయారీ సంస్థ (బీఈఎంఎల్) ఇందుకోసం ప్రణాళికలు రూపొందించింది. వందే భారత్, మెట్రో రైళ్లను ఎగుమతి చేయడం ద్వారా ప్రపంచంలో తన మార్కెట్ ను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, దక్షిణ అమెరికా, ఆసియా దేశాలను లక్ష్యంగా చేసుకుంది.

వందే భారత్ రైళ్ల తయారీ..

బీఈఎంఎల్ ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ రైలు మొదటి నమూనాను తయారు చేసే పనిలో ఉంటుంది. కొన్ని నెలల్లో రైలును తయారు చేసి ఆవిష్కరించనుంది. ఆ తర్వాత కంపెనీ అనేక ప్రణాళికలు రూపొందించుకుంది. మిడిల్ ఈస్ట్, దక్షిణ అమెరికా, ఆసియా దేశాలకు వందే భారత్ రైళ్లను ఎగుమతి చేయాలని భావిస్తోంది. దానికి గల అవకాశాల కోసం అన్వేషణ సాగిస్తోంది. వాటి ద్వారా ప్రపంచ మార్కెట్‌లో తన ఉత్పత్తులను విస్తరించనుంది. రైలు, మెట్రో సెగ్మెంట్లతో రక్షణ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇవి తమ ఆదాయానికి అతిపెద్ద సహకారిగా మారుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉన్న నాలుగు శాతం ఎగుమతులను పదిశాతానికి పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

ఎగుమతులకు ప్రణాళిక..

బీఈఎంఎల్ చైర్మన్ శంతను రాయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాల ప్రకారం.. భారతీయ రైల్వే కోసం స్వదేశీ వందే భారత్ రైళ్లను విడుదల చేయడానికి కంపెనీ ప్రాధాన్యత ఇస్తోంది. అనంతరం ప్రపంచ మార్కెట్ పై దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా ఎగుమతులను పెంచుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కొత్తగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో భాగంగా వృద్ధిని పెంచుకోవడానికి , తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి బీఈఎంఎల్ లో కొన్ని మార్పులు జరిగాయి. మైనింగ్, నిర్మాణం, రక్షణ, రైలు, మెట్రో తదితర విభాగాలపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఈ విభాగాలకు సంబంధించి 11 వ్యూహాత్మక వ్యాపార యూనిట్లను (ఎస్బీయూలు) ఏర్పాటు చేసింది.

ఆర్థిక ప్రగతి..

బీఈఎంఎల్ లో జరిగిన మార్పుల కారణంగా ఆర్థికంగా మెరుగుదల కనిపించింది. 2024 జూన్ 30 నాటికి ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర నష్టం రూ. 70 కోట్లకు తగ్గింది. దానితో పాటు టాప్ లైన్‌లో 10 శాతం వృద్ధిని సాధించింది. గతంతో పోల్చితే గణనీయమైన మెరుగుదలను కనిపించింది. దీంతో భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను కంపెనీ నిర్దేశించుకుంది. కంపెనీ లెక్కల ప్రకారం.. ఈబీఐటీడీఏ వృద్ధికి 13 శాతం నుంచి 16, 17 శాతానికి చేరుకోవాలని భావిస్తున్నారు. రైలు, మెట్రో, రక్షణ రంగాలపై దృష్టి సారించడంతో భవిష్యత్తు లో అది సాధ్యమేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?