AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ప్రతి పీఎఫ్‌ ఖాతాదారుడికి రూ.50 వేలు అకౌంట్లో పడతాయా? అసలు నిజం ఏంటంటే..?

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది 8.75 శాతానికి చేరవచ్చని అంచనా. దాదాపు 8 కోట్ల మంది ప్రైవేటు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. డిపాజిట్లపై అధిక వడ్డీ లభిస్తుంది.

EPFO: ప్రతి పీఎఫ్‌ ఖాతాదారుడికి రూ.50 వేలు అకౌంట్లో పడతాయా? అసలు నిజం ఏంటంటే..?
Epfo 2
SN Pasha
|

Updated on: Dec 13, 2025 | 6:00 AM

Share

వడ్డీ రేట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేట్ల పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. ఇది మీ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రభుత్వం ఈ ఏడాది వడ్డీ రేట్లను 8.75 శాతానికి పెంచవచ్చని వర్గాలు, మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 8.2 శాతం వడ్డీ రేటును అందించడం గమనించాల్సిన విషయం, ఇది ఇప్పటికే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయబడింది.

ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరానికి అధిక రేట్ల అంచనా ఉద్యోగుల్లో కొత్త ఆశలకు కారణమైంది. ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, జనవరిలో తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఈసారి దేశంలోని 8 కోట్ల మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులు ప్రయోజనం పొందబోతున్నారు. కారణం? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఈపీఎఫ్ వడ్డీ రేటును పెంచవచ్చని వినికిడి. వడ్డీ రేటును 8.25 శాతం నుంచి 8.75 శాతానికి పెంచవచ్చని తెలిసింది.

కానీ ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? మొదటగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఎంత ఉందో దాన్ని బట్టి లాభ మొత్తాన్ని చూస్తారు. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే, వడ్డీ దాదాపు రూ.42 వేలు ఉంటుంది. అదేవిధంగా 8.75 శాతం వడ్డీ రేటుతో రూ.6 లక్షలు ఉంటే, వడ్డీ రూ.50 వేలు అవుతుంది. అయితే ప్రతి ఒక్కరి మాత్రం రూ.50 వేలు రావు. వారి పీఎఫ్‌ అకౌంట్లో ఉన్న సేవింగ్స్‌ను బట్టి మాత్రమే ఖాతాలో నగదు యాడ్‌ అవుతాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి