AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: ట్విట్టర్‌ ఉద్యోగులతో మొదటిసారి మాట్లాడిన ఎలోన్‌ మస్క్‌.. పనితీరు ఆధారంగా ఫలితాలుంటాయని వెల్లడి..

టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులతో మొదటిసారిగా టౌన్‌హాల్ చర్చలు జరిపారు. ఏప్రిల్‌లో ట్విటర్‌ను $44 బిలియన్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత మస్క్ తొలిసారిగా కంపెనీ ఉద్యోగులతో నేరుగా మాట్లాడారు...

Elon Musk: ట్విట్టర్‌ ఉద్యోగులతో మొదటిసారి మాట్లాడిన ఎలోన్‌ మస్క్‌.. పనితీరు ఆధారంగా ఫలితాలుంటాయని వెల్లడి..
Elon Musk
Srinivas Chekkilla
|

Updated on: Jun 17, 2022 | 11:41 AM

Share

టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులతో మొదటిసారిగా టౌన్‌హాల్ చర్చలు జరిపారు. ఏప్రిల్‌లో ట్విటర్‌ను $44 బిలియన్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత మస్క్ తొలిసారిగా కంపెనీ ఉద్యోగులతో నేరుగా మాట్లాడారు. మస్క్ మాట్లాడుతూ.. సంస్థ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాటు నిర్వహణ వ్యయం కూడా తగ్గిస్తామన్నారు. ది వెర్జ్ నివేదిక ప్రకారం ఎలోన్ మస్క్ కంపెనీ ఉద్యోగులతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యాడు. వారు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చాడు. ఉద్యోగుల తొలగింపుపై ఆయనను ప్రశ్నించగా.. కంపెనీకి ఉన్న ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు వస్తోందన్నారు. ఖర్చు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఉద్యోగుల తొలగింపుపై ఆయన స్పష్టంగా ఏమీ చెప్పలేదు. తొలగింపుల ప్రశ్నపై, ఇది పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.

10 నిమిషాల చర్చలో మస్క్ ట్విట్టర్ ఉద్యోగితో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉందని చెప్పారు. మీ ప్రశ్న చట్టాన్ని ఉల్లంఘించనప్పటికీ, ప్రశ్న అడగాలనుకునే సామాన్యుడు ట్విట్టర్‌లో పూర్తి అవకాశం పొందాలన్నారు. కంపెనీలో తొలగింపులకు సంబంధించిన ప్రశ్నపై, మస్క్ ఎటువంటి అవకాశాన్ని తోసిపుచ్చ లేదు. సంస్థ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైనా కంపెనీకి సహకరిస్తే, భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఉద్యోగి పనితీరు ఆధారంగా ఉంటుందని తెలిపారు. కంపెనీ దృష్టి లాభాలపైనే ఉంటుంది. ఇది కాకుండా, ఈ ప్లాట్‌ఫారమ్‌ను కూడా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ట్విట్టర్‌లో ప్రకటనలకు సంబంధించి, ప్రకటనల నమూనాకు తాను వ్యతిరేకం కాదని అన్నారు. కంటెంట్‌ను వీలైనంత వినోదాత్మకంగా చేయడంపై దృష్టి పెట్టాలని నేను ప్రకటనదారులకు చెప్పాలనుకుంటున్నాను అని అన్నారు.