Ather Energy: ఈ రెండు బ్యాంకులతో జతకట్టిన అథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. క్రెడిట్‌ స్కోర్‌ లేకున్నా రుణాలు

Ather Energy:ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన ఇ-స్కూటర్‌ల కోసం రిటైల్ ఫైనాన్స్‌ను అందించడానికి HDFC బ్యాంక్,..

Ather Energy: ఈ రెండు బ్యాంకులతో జతకట్టిన అథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. క్రెడిట్‌ స్కోర్‌ లేకున్నా రుణాలు
Follow us

|

Updated on: Mar 24, 2022 | 3:25 PM

Ather Energy:ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన ఇ-స్కూటర్‌ల కోసం రిటైల్ ఫైనాన్స్‌ను అందించడానికి HDFC బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది . ఈ భాగస్వామ్యంతో ఈ-స్కూటర్ వినియోగదారులకు తక్షణ రుణ సదుపాయాన్ని అందించగలమని ఏథర్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో కొనుగోలుదారులకు గరిష్ట రుణాన్ని అందిస్తాయి. తమ కస్టమర్లు కొనుగోలు సమయంలో వాహనం విలువలో 95 శాతం వరకు రుణాలు తీసుకోవడానికి ఇష్టపడతారని, 2-3 సంవత్సరాల పాటు చెల్లించుకునేందుకు అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఫైనాన్సింగ్ సదుపాయం ఉండడం వల్ల వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయడం సులభతరం అవుతుందన్నారు .

క్రెడిట్ హిస్టరీ లేని కస్టమర్లు కూడా లోన్ పొందుతారు:

కాగా, టైర్-2, టైర్-3 నగరాల్లో విస్తరణ దృష్ట్యా ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేని కస్టమర్లకు వాహన రుణాలు అందించడం చాలా ముఖ్యమని ఏథర్ ఎనర్జీ పేర్కొంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో వినియోగదారులకు రుణ సదుపాయం సులభతరం అవుతుంది.

అథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ ఫోకెలా మాట్లాడుతూ.. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం వల్ల కస్టమర్లకు వాహనాలను కొనుగోలు చేయడం సులభతరం చేస్తుందని, ఎలక్ట్రిక్ వాహన ప్రియుల విశ్వాసాన్ని పెంచుతుందని మేము విశ్వసిస్తున్నామని అన్నారు.

పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ పరిశ్రమ గత ఏడాదిలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. తమ 450 సిరీస్‌లకు డిమాండ్‌ గణనీయంగా పెరిగిందని, 20 శాతం వృద్ధిని నమోదు చేశామని కంపెనీ తెలిపింది. గత రెండు సంవత్సరాల్లో ఏథర్‌లోకి ఆర్థిక ప్రవేశం గణనీయంగా పెరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగదారులు సులభంగా కొనుగోలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. భారతదేశంలో ఆటోమొబైల్స్ ఎక్కువగా ఫైనాన్స్ ఎంపికల ద్వారా కొనుగోలు చేయబడతాయని ఏథర్ ఎనర్జీ తెలిపింది. భారత్‌లో విక్రయించే 10 వాహనాల్లో 8 ద్విచక్ర వాహనాలేనని వెల్లడించింది. భారతదేశంలో టూ వీలర్ల ఫైనాన్స్ వ్యాప్తి దాదాపు 50 శాతానికి చేరుకుందని ఏథర్ ఎనర్జీ తెలిపింది.

2025 నాటికి టూ వీలర్ రుణ మార్కెట్ $12.3 బిలియన్లకు..

ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం.. దేశీయ ద్విచక్ర వాహన రుణ మార్కెట్ 2025 నాటికి US $ 12.3 బిలియన్లకు పెరుగుతుందని కంపెనీ అంచనా వేసింది. గత ఏడాది కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరిగింది. Ather Energy చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ ఫోకెలా మాట్లాడుతూ.. వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడం, EVలకు సాఫీగా మారడానికి బహుళ ఫైనాన్సింగ్ ఎంపికలను అందించడం కంపెనీ దృష్టి సారించినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

FD Schemes: ఈ స్కీమ్‌లో మరిన్ని ప్రయోజనాలు పొందాలంటే మార్చి 31 వరకే అవకాశం..!

Pan-Aadhaar Link: ముఖ్యమైన అలర్ట్‌.. మార్చి 31లోగా ఈ పని పూర్తి చేసుకోండి.. లేదంటే రూ.10వేల జరిమానా చెల్లించుకోవాల్సిందే