AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. మరోసారి డీఏ పెరిగే అవకాశం..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (DA), డీఆర్ మళ్లీ పెరిగే అవకాశం ఉంది. మీడియా నివేదికల ప్రకారం పెంపుదల వచ్చే నెల ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉంది...

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. మరోసారి డీఏ పెరిగే అవకాశం..
DA
Srinivas Chekkilla
|

Updated on: Jun 24, 2022 | 12:44 PM

Share

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (DA), డీఆర్ మళ్లీ పెరిగే అవకాశం ఉంది. మీడియా నివేదికల ప్రకారం పెంపుదల వచ్చే నెల ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉంది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం-సంబంధిత భత్యం పెంపు ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు పెరుగుతాయని నివేదికలు పేర్కొన్నాయి. డీఏ, డీఆర్‌లను సాధారణంగా ప్రభుత్వం జనవరి, జూలైలో సవరిస్తుంది. DA, DR అనేవి ఉద్యోగులు, పెన్షనర్‌లకు ఇచ్చే జీతం, పెన్షన్‌లోని భాగాలు. ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం మధ్య వివిధ వర్గాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్‌ల పెంచితే వారికి పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. కార్మిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దాదాపు 1.15 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ నిర్ణయం ద్వారా లబ్ది పొందనున్నారు.

కేంద్రం డీఏ, డీఆర్‌లను సవరించిన తర్వాత, దేశవ్యాప్తంగా రాష్ట్రాలు తమ ఉద్యోగులకు, పెన్షనర్‌లకు ప్రయోజనాన్ని విస్తరించాయి. మహమ్మారి తర్వాత వినియోగ డిమాండ్ చాలా రెట్లు పెరగడం వల్ల పెరుగుతున్న ధరల మధ్య ఉద్యోగులు, పెన్షనర్ల చేతిలో అదనపు డబ్బు ప్రజలకు వారి ఖర్చులకు సరిపోతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ముఖ్యంగా మహమ్మారి కారణంగా ప్రభుత్వం 1.5 సంవత్సరాలుగా డీఏ, డీఆర్‌లను పెంచలేదు. మహమ్మారిపై పోరాడేందుకు నిధులను మళ్లించడానికి ప్రభుత్వం జనవరి 2020 నుంచి జూన్ 30, 2021 వరకు DA పెంపును ఆపింది. ఆ తర్వాత డీఏను 17% నుంచి 28%కి పెంచారు. 2021 అక్టోబర్‌లో డీఏ మళ్లీ 3% నుంచి 31%కి పెరిగింది. ఈ ఏడాది జనవరిలో భృతిని 34 శాతానికి పెంచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..