AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం, వెండిని మర్చిపోండి.. భవిష్యత్తులో రాగి కొన్న వారే ధనవంతులు! ఎందుకంటే..?

బంగారం, వెండి బదులు రాగిలో పెట్టుబడి భవిష్యత్ సంపదకు కీలకం అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరశక్తి వంటి పచ్చని శక్తి రంగాలకు రాగి అత్యవసరం, దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది. గనుల కొరతతో సరఫరా తగ్గడంతో, రాగి ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ వంటి నివేదికలు అంచనా వేస్తున్నాయి.

బంగారం, వెండిని మర్చిపోండి.. భవిష్యత్తులో రాగి కొన్న వారే ధనవంతులు! ఎందుకంటే..?
Copper
SN Pasha
|

Updated on: Nov 11, 2025 | 7:30 AM

Share

ఈ సంవత్సరం బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. చాలా మంది మంచి రాబడి కోసం వాటిలో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. చాలా మంది పెట్టుబడిదారులు బంగారం, వెండి భవిష్యత్ భరోసా అని నమ్ముతారు. అయితే ఫ్యూచర్‌లో బంగారం, వెండి కాదు, రాగి హవా నడుస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. సీనియర్ విశ్లేషకుడు సుజయ్ యు హెచ్చరిస్తూ.. భారతీయులు బంగారం కోసం పరిగెడుతున్నప్పటికీ, రాబోయే దశాబ్దంలో భారీ పెరుగుదలను చూడబోయే ఆస్తిని వారు విస్మరిస్తున్నారు. రాగి అనేది రాబోయే 5 నుండి 10 సంవత్సరాలలో సంపద కొత్త శకానికి నాంది పలికే లోహం అని ఆయన లింక్డ్ఇన్‌లో రాశారు. దాదాపు అందరు భారతీయులకు దాని పెరుగుతున్న డిమాండ్ గురించి తెలియదని ఆయన వాదిస్తున్నారు.

రాగికి డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?

రాగి లేకుండా ప్రపంచం భవిష్యత్తును నిర్మించుకోలేదని సుజయ్ రాస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సౌర ఫలకాలు, ఛార్జింగ్ స్టేషన్లు, పవర్ గ్రిడ్‌లు, డేటా సెంటర్లకు రాగి చాలా అవసరం. ఇవన్నీ గ్రీన్ ఎనర్జీ మెటల్స్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన స్తంభాలు. ఈ సందర్భంలో రాగికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.

మరోవైపు దాని సరఫరా కూడా చాలా తక్కువగా ఉంది. ఇండోనేషియాలోని అతిపెద్ద రాగి గనులలో ఒకటైన గ్రాస్‌బర్గ్ వరదలు, ప్రమాదాల వల్ల ప్రభావితమైంది. దీని వలన 2026 నాటికి 600,000 టన్నుల కంటే ఎక్కువ ఉత్పత్తి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. కొత్త రాగి గనిని తెరవడానికి 10 నుండి 15 సంవత్సరాలు పట్టవచ్చు, ఉన్న గనులు క్షీణిస్తున్నాయి లేదా వాటి ఖనిజ నాణ్యత క్షీణిస్తోంది.

మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం.. 2026లో రాగి మార్కెట్ 22 సంవత్సరాలలో అతిపెద్ద కొరతను ఎదుర్కొంటుంది. ఈ కొరత 5.90 లక్షల టన్నులకు చేరుకోవచ్చు. 2029 నాటికి ఈ కొరత 1.1 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా. 2020 తర్వాత మొదటిసారిగా ప్రపంచ రాగి ఉత్పత్తి తగ్గనున్నందున ఇది జరుగుతోంది.

సరఫరా తగ్గడంతో ధరలు పెరిగాయి

రాగి కొరత మార్కెట్లో ఆందోళనలను సృష్టించింది. ఫలితంగా రాగి ధరలు ఇటీవల ఒకే రోజులో 3 నుండి 3.5 శాతం పెరిగాయి. గోల్డ్‌మన్ సాచ్స్, సిటీ ఇప్పుడు రాగి ధరలు రాబోయే కొన్ని సంవత్సరాలలో టన్నుకు 11,000 డాలర్ల నుండి 14,000 డాలర్ల వరకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నాయి. ఇది 20 నుండి 50 శాతం ధర పెరుగుదలను సూచిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us