‘బికినీ’ ఎయిర్లైన్స్ బ్యూటిఫుల్ ఆఫర్.. జర దేఖో గురూ!
కాంట్రవర్సీలకు కేంద్ర బిందువు అయిన వియత్ జెట్ విమానయాన సంస్థ భారతదేశంలోకి రంగం ప్రవేశం చేయనుంది. వియత్నాంకు చెందిన ఈ సంస్థ ‘బికినీ ఎయిర్లైన్స్’గా పేరుగాంచింది. ఈ ఎయిర్లైన్స్ డిసెంబర్ నుంచి ఇండియా- వియత్నాం మధ్య ప్రత్యేక విమాన సర్వీసులను ప్రారంభించనుంది. డిసెంబర్ 6న ప్రారంభమయ్యే న్యూఢిల్లీ-హోచి మిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలను నడుపుతామని ఆ సంస్థ పేర్కొంది. హనోయి-ఢిల్లీ మార్గం మధ్య డిసెంబర్ 7 నుంచి వారానికి మూడు రిటర్న్ విమానాలను […]
కాంట్రవర్సీలకు కేంద్ర బిందువు అయిన వియత్ జెట్ విమానయాన సంస్థ భారతదేశంలోకి రంగం ప్రవేశం చేయనుంది. వియత్నాంకు చెందిన ఈ సంస్థ ‘బికినీ ఎయిర్లైన్స్’గా పేరుగాంచింది. ఈ ఎయిర్లైన్స్ డిసెంబర్ నుంచి ఇండియా- వియత్నాం మధ్య ప్రత్యేక విమాన సర్వీసులను ప్రారంభించనుంది. డిసెంబర్ 6న ప్రారంభమయ్యే న్యూఢిల్లీ-హోచి మిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలను నడుపుతామని ఆ సంస్థ పేర్కొంది. హనోయి-ఢిల్లీ మార్గం మధ్య డిసెంబర్ 7 నుంచి వారానికి మూడు రిటర్న్ విమానాలను నడుపుతామని వెల్లడించింది.
ఇది ఇలా ఉంటే ఓ బంపర్ ఆఫర్ను కూడా ఈ సంస్థ ప్రకటించింది. త్రి గోల్డెన్ డేస్ పేరుతో స్పెషల్ ప్రమోషన్ సేల్ నిర్వహిస్తోంది. ఆగస్టు 20-22వరకు కేవలం 9 రూపాయలకే టిక్కెట్లను విక్రయించనుంది. వ్యాపారాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో భారతదేశం తమకు మొదటి ప్రాధాన్యమని వియత్జెట్ ఉపాధ్యక్షుడు న్యూమెన్ తన్ సన్ తెలిపారు.
ఇకపోతే 2011 డిసెంబర్లో మొదలైన ఈ వియత్ జెట్ సంస్థ ‘బికినీ ఎయిర్లైన్స్’గా పేరుగాంచడం వెనుక ఓ స్టోరీ ఉంది. ఈ సంస్థకు చెందిన కొన్ని విమానాల్లో సిబ్బంది బికినీలు ధరించి ఉంటారు. అంతేకాకుండా ఏటా విమానయాన సంస్థ విడుదలచేసే క్యాలెండర్లో కూడా విమానంలో పనిచేసే అమ్మాయిలు బికినీల్లో ఉన్న ఫొటోలే దర్శనమిస్తాయి. వియత్నాం ప్రయాణికులు కూడా ఎక్కువగా ఈ ఎయిర్లైన్స్నే ఎక్కుతుంటారు.