AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Jio: 5G రాకముందు Jio దూకుడు.. 29 లక్షలకు పైగా కొత్త కస్టమర్లు

Reliance Jio: టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు 5జీ టెక్నాలజీ రాబోతోంది. ఇందు కోసం ఆయా టెలికం కంపెనీలు 5జీని తీసుకువచ్చేందుకు సన్నాహాలు..

Reliance Jio: 5G రాకముందు Jio దూకుడు.. 29 లక్షలకు పైగా కొత్త కస్టమర్లు
Jio
Subhash Goud
|

Updated on: Sep 20, 2022 | 8:00 AM

Share

Reliance Jio: టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు 5జీ టెక్నాలజీ రాబోతోంది. ఇందు కోసం ఆయా టెలికం కంపెనీలు 5జీని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందుకోసం టెలికాం కంపెనీల వినియోగదారులను చేర్చుకుఏన పనిలో పడ్డాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తాజా డేటా ప్రకారం.. రిలయన్స్ జియో జూలైలో 29.4 లక్షల వినియోగదారులను చేర్చుకుంది. దీంతో కంపెనీ సబ్‌స్క్రిప్షన్ బేస్ 41.59 కోట్లకు పెరిగింది.

ఇక రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన భారతీ ఎయిర్‌టెల్ కేవలం 5 లక్షల కస్టమర్లను మాత్రమే చేర్చుకుంది. ఇది దాని వినియోగదారుల సంఖ్య 36.34 కోట్లకు చేరుకుంది. వొడాఫోన్ ఐడియా కస్టమర్ల నష్టం కొనసాగింది. ఈ కంపెనీ జూలైలో 15.4 లక్షల మంది మొబైల్ కస్టమర్లను కోల్పోయింది. ఆ తర్వాత కంపెనీ వినియోగదారుల సంఖ్య 25.51 కోట్లకు పెరిగింది. BSNL, MTNL వరుసగా 1,327,999, 3,038 చందాదారులను కోల్పోయాయి.

ఏ కంపెనీ మార్కెట్‌ వాటా ఎంత?

ఇవి కూడా చదవండి

జియో 36.23 శాతం, ఎయిర్‌టెల్ 31.66 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది. అదే సమయంలో వోడాఫోన్-ఐడియా 22.22 శాతం మార్కెట్‌ను స్వాధీనం చేసుకుంది. నివేదిక ప్రకారం, జూలైలో 1 కోటి మంది కస్టమర్లు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ( MNP) కోసం అభ్యర్థించారు. ఇది ఇప్పుడు 72.47 కోట్లకు పెరిగింది. అదే సమయంలో వినియోగదారుల సంఖ్య జూన్ చివరి నాటికి 2.55 మిలియన్ల నుండి జూలై చివరి నాటికి 2.56 మిలియన్లకు పెరిగింది.

ఈ విషయంలో జియో కంటే ఎయిర్‌టెల్ ముందుంది. యాక్టివ్ మొబైల్ వినియోగదారుల పరంగా Airtel Jio, Vi కంటే ముందుంది. కంపెనీకి 97.99 శాతం యాక్టివ్ యూజర్లు ఉన్నారు. జూలై చివరి నాటికి భారతదేశ మొబైల్ వినియోగదారుల సంఖ్య 0.06% పెరిగి 1.148 బిలియన్లకు చేరుకుందని నివేదికలు వెల్లడవుతున్నాయి. ఒక నెల క్రితం 1.147 బిలియన్లు. పట్టణ ప్రాంతాల్లో జూన్ చివరి నాటికి దాదాపు 640 మిలియన్ల నుండి జూలై చివరి నాటికి వినియోగదారుల సంఖ్య 650 మిలియన్లకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో చందాలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో 52.38 కోట్లు ఉన్న కస్టమర్ల సంఖ్య 52.32 కోట్లకు తగ్గింది. దాదాపు 6 లక్షల మంది వినియోగదారులు నష్టపోయారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి