Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Brand: ఇక నిరుపేదలకు ఊరట.. సబ్సిడీ ధరకు గోధుమ పిండి, బియ్యం విక్రయాలు

భారత్ బ్రాండ్ రెండో దశ రిటైల్ విక్రయాలు పున:ప్రారంభమయ్యాయి.. ప్రస్తుతం గోధుమ పిండి, బియ్యం సబ్సిడీ ధరలకు విక్రయిస్తున్నారు. గోధుమ పిండి ప్యాకెట్లు కిలో రూ.30కి గరిష్ఠంగా ఐదు ప్యాకెట్లు అందిస్తున్నారు. అలాగే కిలో రూ.34 చొప్పున 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ రెండో దశలో 3.69 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలు, 2.91 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని రిటైల్‌ విక్రయానికి అందుబాటులో ఉంచారు. ఇవి అయిపోయే వరకు సబ్సిడీ ధరలతో విక్రయం కొనసాగుతుంది. ఆ తర్వాత అవసరమైతే మరిన్ని గోధుమలు, బియ్యం అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముంది.

Bharat Brand: ఇక నిరుపేదలకు ఊరట.. సబ్సిడీ ధరకు గోధుమ పిండి, బియ్యం విక్రయాలు
Bharat Brand
Follow us
Narsimha

| Edited By: Ravi Kiran

Updated on: Nov 08, 2024 | 9:45 PM

భారత్ బ్రాండ్ రిటైల్ విక్రయాల రెండో దశ ప్రారంభమైంది. ప్రస్తుతం గోధుమ పిండి, బియ్యం సబ్సిడీ ధరలకు విక్రయిస్తున్నారు. జొన్నలు, శనగలు కూడా విక్రయించే యోచనలో ఉన్నారు. అక్టోబర్ 2023 నుండి జూన్ 2024 వరకు మొదటి దశలో భారత్ బ్రాండ్ విక్రయాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు మరోమారు నిత్యావసర ఆహార పదార్థాల ధరల పెరుగుదలను నివారించేందుకు ప్రభుత్వం భారత్ బ్రాండ్‌తో రిటైల్ పథకాన్ని పునఃప్రారంభించింది.

ఈ రెండో దశలో ప్రభుత్వం గోధుమ పిండి, బియ్యం వంటి ఆహార పదార్థాలను విక్రయిస్తోంది. గోధుమ పిండి ప్యాకెట్లు కిలో రూ.30కి ఐదు ప్యాకెట్లు అందిచనున్నారు. అలాగే కిలో రూ.34 చొప్పున 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం ధర రూ.55 నుంచి రూ.60 పలుకుతోంది. గోధుమ పిండి రూ.45-50, శనగలు రూ.90-100, మినపప్పు రూ.120-130. ప్రభుత్వ సబ్సిడీ కింద బియ్యం రూ.34, గోధుమపిండి రూ.30, శనగలు రూ.70, శనగలు రూ.107కు విక్రయించనున్నారు.

మొదటి దశలో, సుమారు 15.20 లక్షల మెట్రిక్ టన్నుల భారత్ గోధుమ పిండి, 14.58 లక్షల మెట్రిక్ టన్నుల భారత్ బియ్యం సాధారణ వినియోగదారులకు సబ్సిడీ ధరలకు అందుబాటులో ఉంచబడ్డాయి. రెండో దశలో 3.69 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలు, 2.91 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని రిటైల్‌ విక్రయానికి అందుబాటులో ఉంచారు. ఇవి అయిపోయే వరకు సబ్సిడీ ధరలతో విక్రయం కొనసాగుతుంది. ఆ తర్వాత అవసరమైతే మరిన్ని గోధుమలు, బియ్యం అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముంది.

భారత్ బ్రాండ్ పథకం అనేది వినియోగదారుల సౌకర్యార్థం చేపట్టిన తాత్కాలిక పథకం అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. వీటిని వివిధ ప్రభుత్వ ఆహార విక్రయ కేంద్రాలైన NCCF, NAFED మరియు ఇ-కామర్స్/బిగ్ చైన్ రిటైలర్ల దుకాణాలు లతో పాటు మొబైల్ వ్యాన్‌లలో సబ్సిడీ ధరలకు విక్రయిస్తున్నారు.

థియేటర్స్‌లో దారుమైన డిజాస్టర్.. కట్ చేస్తే ఓటీటీలో..
థియేటర్స్‌లో దారుమైన డిజాస్టర్.. కట్ చేస్తే ఓటీటీలో..
రూ.3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఈ రంగాలకు పెద్ద పీట!
రూ.3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఈ రంగాలకు పెద్ద పీట!
నా భార్యను ఇంటికి పంపిస్తారా.. లేదా? నడిరోడ్డుపై భర్త హల్‌చల్
నా భార్యను ఇంటికి పంపిస్తారా.. లేదా? నడిరోడ్డుపై భర్త హల్‌చల్
ఓటీటీలోకి వచ్చేసిన తండ్రీ కొడుకుల సినిమా 'బ్రహ్మా ఆనందం'
ఓటీటీలోకి వచ్చేసిన తండ్రీ కొడుకుల సినిమా 'బ్రహ్మా ఆనందం'
హైదరాబాద్‌ కుర్రోడి సత్తా.. రూ.3 కోట్ల వార్షిక వేతనంతో కొలువు!
హైదరాబాద్‌ కుర్రోడి సత్తా.. రూ.3 కోట్ల వార్షిక వేతనంతో కొలువు!
ఇండియా తీసేసి.. భారత్‌ పెట్టండి! హైకోర్టు ఆదేశం
ఇండియా తీసేసి.. భారత్‌ పెట్టండి! హైకోర్టు ఆదేశం
రిలయన్స్‌ జియో నుంచి మూడు చౌకైన ప్లాన్స్‌..వ్యాలిడిటీ, బెనిఫిట్స్
రిలయన్స్‌ జియో నుంచి మూడు చౌకైన ప్లాన్స్‌..వ్యాలిడిటీ, బెనిఫిట్స్
నేడే పాలిసెట్‌ 2025 నోటిఫికేషన్‌.. ఈసారి సీట్లన్నీ మనకే!
నేడే పాలిసెట్‌ 2025 నోటిఫికేషన్‌.. ఈసారి సీట్లన్నీ మనకే!
సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త సినిమా వచ్చేస్తోంది.
సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త సినిమా వచ్చేస్తోంది.
క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు.. అందర్నీ బయటకు లాగుతాం..
క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు.. అందర్నీ బయటకు లాగుతాం..