బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్… అదిరిపోయే పండుగ ఆఫర్లు!

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) కస్టమర్లకు అదిరిపోయే పండుగ ఆఫర్లు ప్రకటించింది. రిటైల్ రుణాలపై బంపరాఫర్లు అందిస్తోంది. హోమ్ లోన్స్‌పై తగ్గింపు వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. కస్టమర్లకు ఆకర్షించేదానికి అలాగే ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సలీల్ కుమార్ మాట్లాడుతూ.. లోన్ ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే తగ్గింపు వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ అందిస్తున్నట్లు తెలిపారు. రూ.30 లక్షల […]

బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్... అదిరిపోయే పండుగ ఆఫర్లు!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 08, 2019 | 6:50 PM

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) కస్టమర్లకు అదిరిపోయే పండుగ ఆఫర్లు ప్రకటించింది. రిటైల్ రుణాలపై బంపరాఫర్లు అందిస్తోంది. హోమ్ లోన్స్‌పై తగ్గింపు వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. కస్టమర్లకు ఆకర్షించేదానికి అలాగే ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసింది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సలీల్ కుమార్ మాట్లాడుతూ.. లోన్ ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే తగ్గింపు వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ అందిస్తున్నట్లు తెలిపారు. రూ.30 లక్షల వరకు హోమ్ లోన్స్‌పై 8.35 శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ.30 లక్షలకు పైన హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటును రెపో రేటుతో అనుసంధానం చేస్తున్నట్లు వివరించారు.

బీఓఐ ఎడ్యుకేషన్ లోన్‌ను ఆకర్షణీయ వడ్డీ రేటుకే అందిస్తోంది. అలాగే బ్యాంక్ ఎస్ఎంఈ వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల మధ్యలో రుణాలకు తగ్గింపు వడ్డీ రేటు లభిస్తుందని బ్యాంక్ తెలిపింది.

ఇకపోతే గత నెలలో దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పండుగ ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. హోమ్ లోన్స్, వాహన రుణాలను చౌక వడ్డీకే సొంతం చేసుకోవచ్చు. ఎస్‌బీఐ కూడా ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసింది. ప్రిఅప్రూవ్డ్ డిజిటల్ రుణాలు కూడా ఆఫర్ చేస్తోంది.