AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayushman Bharat Yojana: మోడీ సర్కార్‌ నుంచి ఆయుష్మాన్ భారత్ యోజన.. ఈ పథకం కింద రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో పథకాలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వ పథకాలు పేదలకు మధ్యతరగతి, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ప్రయోజనాలను అందిస్తాయి. పెన్షన్..

Ayushman Bharat Yojana: మోడీ సర్కార్‌ నుంచి ఆయుష్మాన్ భారత్ యోజన.. ఈ పథకం కింద రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స
Ayushman Bharat
Subhash Goud
|

Updated on: Feb 08, 2023 | 7:21 AM

Share

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో పథకాలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వ పథకాలు పేదలకు మధ్యతరగతి, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ప్రయోజనాలను అందిస్తాయి. పెన్షన్, నిరుద్యోగ భృతి, గృహనిర్మాణం, రేషన్, బీమా ప్రయోజనాలను అందించడానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. అలాంటి ఒక పథకం ఆయుష్మాన్ భారత్ మిషన్. ఇందులో అర్హులైన వ్యక్తులకు ఆరోగ్య సేవలు అందుతాయి. ఈ పథకం కింద నిరుపేద కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందజేస్తారు. ఆయుష్మాన్ డిజిటల్ ఇండియా మిషన్ కింద 20 కోట్ల ఆరోగ్య రికార్డులు డిజిటల్‌గా నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దేశంలోని అన్ని పేద కుటుంబాలకు ప్రయోజనాలు అందుతాయి. మీరు ఈ పథకం కింద అర్హులైతే మీరు రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సను పొందవచ్చు.

మీరు అర్హులా? కదా చెక్ చేసుకోండి

ఈ పథకం కింద అర్హతను తనిఖీ చేయడానికి ముందుగా మీరు పథకం అధికారిక పోర్టల్ pmjay.gov.in ను సందర్శించాలి. ఇప్పుడు ‘యామ్ ఐ ఎలిజిబుల్’ ఆప్షన్‌కు వెళ్లండి. మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని నమోదు చేయండి. తర్వాత అక్కడ అడిగిన వివరాలను నమోదు చేయాలి. తర్వాత స్క్రీన్‌పై వివరాలు కనిపిస్తాయి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

మీరు ఈ పథకం కింద దరఖాస్తు చేయాలనుకుంటే మీరు అవసరమైన పత్రాలతో అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఇది కాకుండా, మీరు జిల్లా కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా కూడా పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి