#Lockdown లాక్‌డౌన్ నేపథ్యంలో జలమండలి సంచలన నిర్ణయం

లాక్‌డౌన్ నేపథ్యంలో జనం ఇల్లు కదలలేని పరిస్జితిలో వుండగా హైదరాబాద్ జలమండలి సంచలన నిర్ణయం తీసుకుంది.

#Lockdown లాక్‌డౌన్ నేపథ్యంలో జలమండలి సంచలన నిర్ణయం
Follow us

|

Updated on: Mar 28, 2020 | 7:33 PM

Water board sensational decision during lock-down days: లాక్‌డౌన్ నేపథ్యంలో జనం ఇల్లు కదలలేని పరిస్జితిలో వుండగా హైదరాబాద్ జలమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. అందరూ ఇళ్ళలో వుంటే జల వినియోగం పెరుగుతోంది… తద్వారా నీటి కోసం సమస్యలు కూడా రెట్టింపతాయి. అందుకే జలమండలి తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.

జల మండలి బోర్డు దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం నిర్వహించిన డయల్ యువర్ ఎండీ కార్యక్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మారెడ్ పల్లి, గచ్చిబౌలి, రాజేంద్ర నగర్, కొండాపూర్, చిలకలగూడ, బాచుపల్లి, కాచిగూడ, తలాబ్ కట్ట, నాచారం, గోషామహల్, మాదాపూర్ తదితర ప్రాంతాల నుంచి అరకొర నీటి సరఫరాలో ప్రెషర్, బిల్లింగ్, సెవరెజీ, రెవెన్యూలకు సంబంధించిన 24 ఫిర్యాదులను డయల్ యువర్ ఎండీ కార్యక్రమంలో స్వీకరించారు. జనరల్ మేనేజర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

జలమండలి ఎండి జిఎంలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జలమండలి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్క మేనేజర్ ప్రతి రోజు కింది స్థాయి సిబ్బంది ఆరోగ్య విషయాలు, యోగక్షేమాలు తెలుసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి కార్యాలయంలో సోడియం హైపోక్లోరైట్ రసాయనం చెల్లించాలని ఆదేశించారు. ప్రతి ఉద్యోగి శానిటైజర్, మాస్కులు వాడేలా చర్యలు తీసుకోవాలని ఎండి తెలిపారు. వీటిని అందరికి అందుబాటులో ఉంచాలన్నారు.

అత్యవసరంగా స్పందించేందుకు నాలుగు టాస్క్ ఫోర్స్ బృందాలను ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇందులో 100 మంది లైన్ మెన్లు, సేవరేజ్ సిబ్బంది, 1 జీఎం, ఇద్దరు డిజిఎంలు, నలుగురు మేనేజర్లు, ఒక ఎస్సై, పోలీస్ సిబ్బంది ఉండాలని సూచించారు. నగరంలో ఎక్కడ అత్యవసర మంచినీటి, సేవరేజ్ సమస్యలు ఏర్పడితే వెంటనే ఈ బృందాలు వాటిని పరిష్కరిస్తారని ఎండి తెలిపారు.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ