AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BREAKING: తెలంగాణలో మరో 52 కరోనా కేసుల నమోదు

తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 1,813కి చేరింది. ఇక 696 యాక్టివ్ కేసులు ఉండగా.. 1068 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 49 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇవాళ 25 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ కాగా.. 33 కొత్త కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కాగా, మిగిలిన 19 […]

BREAKING:  తెలంగాణలో మరో 52 కరోనా కేసుల నమోదు
Balaraju Goud
|

Updated on: May 23, 2020 | 9:48 PM

Share

తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 1,813కి చేరింది. ఇక 696 యాక్టివ్ కేసులు ఉండగా.. 1068 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 49 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు ఇవాళ 25 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ కాగా.. 33 కొత్త కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కాగా, మిగిలిన 19 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారివిగా తేలింది. ఇప్పటివరకు 137 మంది వలస కూలీలకు కరోనా సోకింది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే.. వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, గద్వాల వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక మిగతా 25 జిల్లాల్లో 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.