డ్రగ్స్ దందాలో కొత్త కోణం.. సంచలనం రేపుతున్నఛార్జీషీట్‌

గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నగరంలో మాదక ద్రవ్యాల దందా కూడా అంతర్జాతీయ స్థాయికి చేరింది. తాజాగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఛార్జీషీట్ సంచలన విషయాలను వెల్లడించింది. హైదరాబాద్‌లో నమోదైన డ్రగ్స్ కేసుల వివరాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం కింద సంపాదించింది. అయితే హైదరాబాద్ మహానగరం పరిధిలో గత రెండేళ్ళ కాలంలో మొత్తం 12 డ్రగ్స్ కేసులు నమోదైనట్లు పేర్కొన్న ఎక్సైజ్ శాఖ… కేవలం […]

డ్రగ్స్ దందాలో కొత్త కోణం.. సంచలనం రేపుతున్నఛార్జీషీట్‌
Follow us

|

Updated on: Sep 22, 2020 | 4:16 PM

గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నగరంలో మాదక ద్రవ్యాల దందా కూడా అంతర్జాతీయ స్థాయికి చేరింది. తాజాగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఛార్జీషీట్ సంచలన విషయాలను వెల్లడించింది. హైదరాబాద్‌లో నమోదైన డ్రగ్స్ కేసుల వివరాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం కింద సంపాదించింది. అయితే హైదరాబాద్ మహానగరం పరిధిలో గత రెండేళ్ళ కాలంలో మొత్తం 12 డ్రగ్స్ కేసులు నమోదైనట్లు పేర్కొన్న ఎక్సైజ్ శాఖ… కేవలం ఎనిమిది కేసులకు సంబంధించిన ఛార్జీషీట్లను మాత్రమే ఫోరం ప్రతినిధులకు అందజేశారు. మిగిలిన నాలుగింటిలో ఇంకా చార్జీషీట్ దాఖలు చేయలేదని తెలుస్తోంది. ఈ నాలుగు కేసులు టాలీవుడ్ రంగానికి చెందినవే కావడం విశేషం.

టాలీవుడ్‌కు సంబంధించిన 4 కేసులపై సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులకు ఇచ్చిన ఎనిమిది ఛార్జీషీట్లలో పలు సంచలన అంశాలు వెలుగు చూశారు. హైదరాబాద్ డ్రగ్స్ దందా ఖండాంతరాలు దాటిన విషయం ఈ ఛార్జీషీట్ల ద్వారా వెలుగులోకి వచ్చింది. జర్మనీ, బ్రిటన్‌, ఇంగ్లాండ్‌ల నుంచి కొరియర్‌ ద్వారా హైదరాబాద్ నగరానికి డ్రగ్స్‌ సప్లై అవుతున్నట్లు పేర్కొన్నారు. విదేశాలనుంచి స్టీల్‌బౌల్స్‌ పేరుతో కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ www.ipsld.lo వెబ్‌సైట్‌ ద్వారా బుక్ చేసుకుని తెప్పించుకుంటున్న వైనం బయట పడింది. ఇందులో ఎక్కువగా విద్యార్థులే వున్నారని ఛార్జీషీట్లలో పేర్కొన్నారు.

సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ మహేశ్వర ఫార్మాలో సైతం డ్రగ్స్‌ విక్రయాలు జరిగినట్లు పేర్కొన్నారు. ఎనిమిది చార్జిషీట్లలో కాలేజీ స్టూడెంట్స్‌తో పాటు ప్రముఖుల పేర్లు వుండడం విశేషం. మరోవైపు సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ కేసులో మొత్తం 72 మంది పేర్లు వుండగా.. వారిలో 12 మంది మాత్రమే విచారణకు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం ఇచ్చిన ఛార్జీషీట్లతోపాటు మిగిలిన నాలుగు కేసుల ఛార్జీషీట్లను వెలుగులోకి తేవాలని ఫోరం ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. డ్రగ్స్ దందాపై విచారించిన సిట్ నివేదికను బయట పెట్టాలని ఫోరం డిమాండ్ చేస్తోంది. సిట్ రిపోర్టు వెలుగు చూస్తే పలువురు టాలీవుడ్ ప్రముఖుల బండారం బయట పడుతుందని ఫోరం ప్రతినిధులంటున్నారు.