AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా ప్రభుత్వం రైతు పక్షపాతి : మంత్రి గౌతంరెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. కాబట్టే కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని వివరణ ఇచ్చారు. రైతులపై కేసులు పెట్టిన ఘటన తెలుసుకున్న సీఎం.. వెంటనే స్పందించారని, కేసులు ఎత్తి వెయ్యాలని అధికారులని తక్షణమే ఆదేశించారని తెలిపారు. ఈ ఏడాది మొదటి పంట కంటే రెండో పంట అధికంగా పండిందని ఆయన తెలిపారు. రైతులందరూ ధైర్యంగా ఉండండని.. రైతులందరికీ […]

మా ప్రభుత్వం రైతు పక్షపాతి : మంత్రి గౌతంరెడ్డి
Venkata Narayana
|

Updated on: Sep 22, 2020 | 3:54 PM

Share

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. కాబట్టే కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని వివరణ ఇచ్చారు. రైతులపై కేసులు పెట్టిన ఘటన తెలుసుకున్న సీఎం.. వెంటనే స్పందించారని, కేసులు ఎత్తి వెయ్యాలని అధికారులని తక్షణమే ఆదేశించారని తెలిపారు. ఈ ఏడాది మొదటి పంట కంటే రెండో పంట అధికంగా పండిందని ఆయన తెలిపారు. రైతులందరూ ధైర్యంగా ఉండండని.. రైతులందరికీ జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని మేకపాటి చెప్పారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి రైతు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం అభినందనీయని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలందరూ ప్రజల సమస్యలని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని గౌతంరెడ్డి కోరారు.