AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking ఏపీలో రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగులుప్పలపాడు మండలం మాచవరంలో రోడ్డు ప్రమాదం సంభవించింది..

Breaking ఏపీలో రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి
Rajesh Sharma
|

Updated on: May 14, 2020 | 8:09 PM

Share

Eight persons died in a road accident in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగులుప్పలపాడు మండలం మాచవరం – రాపర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో మిర్చి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్‌ విద్యుత్‌ స్థంభానికి ఢీకొంది. దాంతో విద్యుత్‌ తీగలు తగిలి 8 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి స్వల్ప గాయాలు కాగా వారిని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగినపుడు ట్రాక్టర్‌లో 30 మంది ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం.

ప్రకాశం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం జగన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని సమాచారం. క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించాలని ఆదేశించారని తెలుస్తోంది.