AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అపెక్స్ భేటీలో కీలక నిర్ణయాలు.. షెకావత్ వెల్లడి

అందరూ ఉత్కంఠతో ఎదురు చూసిన నదీ జలాల వివాద పరిష్కారం అపెక్స్ కౌన్సిల్ భేటీలో అనుకున్నట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యమైనది కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాన్ని...

అపెక్స్ భేటీలో కీలక నిర్ణయాలు.. షెకావత్ వెల్లడి
Rajesh Sharma
|

Updated on: Oct 06, 2020 | 4:01 PM

Share

Crucial decision in Apex council meeting today: అందరూ ఉత్కంఠతో ఎదురు చూసిన నదీ జలాల వివాద పరిష్కారం అపెక్స్ కౌన్సిల్ భేటీలో అనుకున్నట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యమైనది కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలన్న నిర్ణయం ఒకటి. ఇందుకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయని కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు.

మంగళవారం న్యూ ఢిల్లీ నుంచి గజేంద్ర షెకావత్, ఏపీ భవన్ నుంచి ముఖ్యమంత్రి జగన్, హైదరాబాద్ నుంచి కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ భేటీలో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి భేటీలో తీసుకున్న నిర్ణయాలను స్వయంగా వెల్లడించారు. ‘‘ 2014లో ఆంధ్ర ప్రదేశ్ విడిపోయి 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి.. విభజన చట్టం ప్రకారం జలవివాదాల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది.. 2016లో తొలి భేటీ జరిగింది. అనేక పర్యాయాలు వాయిదపడ్డ తర్వాత 2వ భేటీ ఇప్పుడు జరిగింది.. గోదావరి, కృష్ణ నదిపై ప్రాజెక్టులకు అనుమతులు, బోర్డుల అంశాలపై చర్చ జరిగింది.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇద్దరు సీఎంలు హాజరయ్యారు.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు అన్నీ చర్చించాం.. వాటికి ఒక పరిష్కారం తీసుకొచ్చే విషయంలో అడుగు ముందుకు పడింది.. బోర్డు అధికారాల పరిధిపై చర్చించాం .. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను అపెక్స్ కౌన్సిల్ ముందు సబ్మిట్ చేసేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించారు… ’’ అని గజేంద్ర షెకావత్ మీడియాకు వివరించారు.

సమావేశంలో కృష్ణా రివర్ బోర్డు తరలింపుపై కూడా చర్చ జరిగిందని షెకావత్ తెలిపారు. కృష్ణా బోర్డు హైద్రాబాద్ నుంచి విజయవాడ మార్చడం గురించి సుదీర్ఘ చర్చ అనంతరం నిర్ణయం తీసుకున్నామని, ఇకపై కృష్ణా రివర్ మేనేజ్‌మెంటు బోర్డు విజయవాడ నుంచి పని చేస్తుందని ఆయన ప్రకటించారు. గతంలో ట్రిబ్యునల్స్ ఇచ్చిన అవార్డులను నోటిఫై చేశామని, దీనికి తెలంగాణ అభ్యంతరం తెలిపినా.. కేంద్రానికి ఉన్న అధికారాల మేరకు నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. అదే సమయంలో ట్రైబ్యునళ్ళ కేటాయింపుల మీద తెలంగాణ వేసిన కేసులను వెనక్కి తీసుకునే విషయంలో కేసీఆర్‌ను ఒప్పించామని, ఈ కేసును బుధవారమే వెనక్కి తీసుకునేందుకు కేసీఆర్ అంగీకరించారని కేంద్ర మంత్రి వివరించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ ఇకపై కేఆర్ఎంబీ మాత్రమే చూసుకుంటుదని ఆయన స్పష్టం చేశారు. గోదావరి నదీజలాల పున: పంపిణీకి ట్రైబ్యునల్ వేయాలన్న అంశంపై ఇరు ముఖ్యమంత్రులు వినతులు పంపితే వేస్తామని షెకావత్ తెలిపారు.

Also read: ఢిల్లీలో తెలంగాణ బీజేపీ హల్‌చల్

Also read: Dubbak By-poll: ప్రధాన పార్టీల అభ్యర్థులపై క్లారిటీ

Follow Us