AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నారు.. బాబు ఆవేదన

అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారంపై స్పందించిన ఏపీ విపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వం తమ ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు... విపక్ష నేతల ఆర్థిక మూలాలను ప్రభుత్వ అధినేతలు టార్గెట్ చేశారని కామెంట్ చేశారు

ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నారు.. బాబు ఆవేదన
Rajesh Sharma
|

Updated on: Jun 13, 2020 | 4:53 PM

Share

అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారంపై స్పందించిన ఏపీ విపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వం తమ ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు… విపక్ష నేతల ఆర్థిక మూలాలను ప్రభుత్వ అధినేతలు టార్గెట్ చేశారని కామెంట్ చేశారు. శుక్రవారం అరెస్టయి ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండ్‌లో వున్న అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు చంద్రబాబు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అయితే, జ్యూడిషియల్ రిమాండ్‌లో వున్న వ్యక్తిని కలిసేందుకు కోర్టు అనుమతి కావాలని పోలీసులు చెప్పడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ‘‘ అచ్చెన్నాయుడును పరామర్శించటానికి వచ్చాను.. పోలీసులు అనుమతి లేదంటున్నారు.. ఆయన ఆరోగ్య పరిస్థితి బాలేదు.. 15 గంటలు ప్రయాణం చేయించారు.. ఉన్న పళంగా లిఫ్ట్ చేశారు.. ఇళ్ళు కబ్జా చేసి గోడలు దూకి ఇంట్లోకి వెళ్ళారు.. భార్య ఆరోగ్యం బాలేదని చెప్పినా పట్టించుకోలేదు.. ’’ అని వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు కుటుంబం ప్రజలకు సేవ చేసిందని, ఆయన పట్ల ఇలా దుర్మార్గంగా వ్యవహరించడం కరెక్టు కాదని చంద్రబాబు అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్టును ఖండించిన చంద్రబాబు.. అక్రమ కేసులతో తమ నేతల ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం