AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫంక్షన్‌హాల్‌ యజమానిపై కేసు

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని ఫంక్షన్‌ హాల్‌ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫంక్షన్‌హాల్‌ యజమానిపై కేసు
Balaraju Goud
| Edited By: |

Updated on: Jun 11, 2020 | 11:58 PM

Share

దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా కట్టడిలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. సామాజిక దూరం పాటించేందుకు జన సమూహం ఎక్కువగా ఉండే మాల్స్, థియేటర్లు, ఫంక్షన్ హాల్స్ కు అనుమతి ఇవ్వలేదు. సర్కార్ నిబంధనలు పాటించనివారిపై కఠినచర్యలు చేపడుతున్నారు. తాజాగా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని ఫంక్షన్‌ హాల్‌ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కీసర మండలం భోగారంలోని అన్నపూర్ణ ఫంక్షన్‌హాల్‌లో గురువారం పెండ్లి జరిగింది. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ మంది ఈ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హాల్‌కు వెళ్లి పరిశీలించారు. పెండ్లికి వచ్చినవారిలో ఎక్కువ మంది మాస్కులు కూడా ధరించలేదు. దీంతో ఫంక్షన్‌హాల్‌ యజమాని కృష్ణమూర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.