AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ చెప్పడమే ఆలస్యం.. వెంటనే అమలు పర్చిన అమిత్ షా..

రాజకీయాల్లో మోదీ,షాల ద్వయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకరు పైకి మాట్లాడితే.. మరొకరు సైలంట్‌గా అమలు చేస్తుంటారు. ముఖ్యంగా రెండో సారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు తీసుకున్న సంచలన నిర్ణయాలు తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడింది. దీంతో మళ్లీ దేశ ఆర్ధిక వ్యవస్థను గాడినపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ స్వదేశీ వస్తువుల వాడకానికి […]

మోదీ చెప్పడమే ఆలస్యం.. వెంటనే అమలు పర్చిన అమిత్ షా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 13, 2020 | 3:23 PM

Share

రాజకీయాల్లో మోదీ,షాల ద్వయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకరు పైకి మాట్లాడితే.. మరొకరు సైలంట్‌గా అమలు చేస్తుంటారు. ముఖ్యంగా రెండో సారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు తీసుకున్న సంచలన నిర్ణయాలు తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడింది. దీంతో మళ్లీ దేశ ఆర్ధిక వ్యవస్థను గాడినపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ స్వదేశీ వస్తువుల వాడకానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. “ఆత్మ నిర్భర్ భారత్” పేరుతో ప్రధాని మోదీ ఈ పిలుపునిచ్చారు. అయితే ప్రధాని మోదీ సందేశానికి వెంటనే అమిత్ షా రియాక్ట్ అయ్యారు. ఇకపై స్వదేశీ వస్తువులను ప్రోత్సహించేలా.. చర్యలు ప్రారంభించారు.

జూన్ 1వ తేదీ నుంచి.. దేశంలోని అన్ని కేంద్ర బలగాలకు సంబంధించిన క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే అమ్మాలంటూ అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. దీంతో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌కు చెందిన 10 లక్షల మంది సైనికులు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను వాడనున్నారు. ప్రతి ఏటా వీరు దాదాపు రూ. 2800 కోట్ల వ్యాపారం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రజలంతా స్వదేశీ వస్తువులను కొనడం వల్ల.. రాబోయే ఐదేళ్లలో నిజంగానే ఆత్మ నిర్భర్ భారత్ అవుతుందంటూ.. అమిత్ షా తన అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

కాగా, షా తీసుకున్న నిర్ణయంతో ఇక రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్మీ క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులను అమ్మాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మీరు చెప్తే విశ్వం వింటుంది!.. ఈ టెక్నిక్‌తో మీ కోరికలు నెరవేర్చు
మీరు చెప్తే విశ్వం వింటుంది!.. ఈ టెక్నిక్‌తో మీ కోరికలు నెరవేర్చు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే