AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు జమానాలో జరిగిందిదే.. సర్వం వెల్లడించిన బుగ్గన

చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఏపీలో ఏం జరిగిందో ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు హయాంలో జరిగిన బాగోతాలన్ని మీడియాకు వెల్లడించేశారు. చంద్రబాబు మొదట్నించి చెప్పేదొకటి.. చేసేదొకటి అంటూ నిప్పులు వెళ్ళగక్కారు బుగ్గన. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో అనేక బిల్లులు పెండింగ్‌లో పెట్టారని బుగ్గన ఆరోపించారు. పసుపు కుంకుమ పేరిట విద్యుత్ డిపార్ట్‌మెంట్ నుండి డబ్బులు వాడుకున్నారని చెప్పారు. దాదాపు 60 […]

చంద్రబాబు జమానాలో జరిగిందిదే.. సర్వం వెల్లడించిన బుగ్గన
Rajesh Sharma
|

Updated on: Feb 06, 2020 | 2:29 PM

Share

చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఏపీలో ఏం జరిగిందో ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు హయాంలో జరిగిన బాగోతాలన్ని మీడియాకు వెల్లడించేశారు. చంద్రబాబు మొదట్నించి చెప్పేదొకటి.. చేసేదొకటి అంటూ నిప్పులు వెళ్ళగక్కారు బుగ్గన.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో అనేక బిల్లులు పెండింగ్‌లో పెట్టారని బుగ్గన ఆరోపించారు. పసుపు కుంకుమ పేరిట విద్యుత్ డిపార్ట్‌మెంట్ నుండి డబ్బులు వాడుకున్నారని చెప్పారు. దాదాపు 60 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టారని వివరించారు బుగ్గన. దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతోంది కాబట్టే రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని, గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా చూపించిన విధంగా రెవిన్యూ సాధించలేదని బుగ్గన అంటున్నారు.

2014లో రాష్ట్రానికి లక్షా 23 వేల కోట్లు రాష్ట్రానికి అప్పు వుండేదని, దాన్ని చంద్రబాబు 2019 కల్లా రెండు లక్షల 58 వేల కోట్ల అప్పుదాకా తీసుకువెళ్ళారని వివరించారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. తమ ప్రభుత్వం గత ఎనిమిది నెలల్లో కేవలం 36 వేల కోట్లు అప్పు చేసిందని, అందులోను 7 వేల కోట్లు టిడిపి హయాంలో కమిటైనవేనని అన్నారాయన. ఎలక్షన్ సమయంలో ఒకే రోజున 5 వేల కోట్లు అప్పు తెచ్చారని చెప్పారు బుగ్గన. చంద్రన్న కానుక అప్పులు కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తీరుస్తుందని బుగ్గన అంటున్నారు.