ఐపీఎల్ అక్కడే.. అవే తేదీలు.. ఫిక్స్..
వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఐపీఎల్ -13 సీజన్ జరగడంపై ఉత్కంఠ వీడింది. తేదీలు ఖారాయ్యాయి. అంతా అనుకున్నట్టుగానే సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్ జరుగుతుందని పాలకమండలి చైర్మన్ బ్రిజేశ్ పటేల్ అధికారికంగా వెల్లడించాడు. యూఏఈలోని షార్జా, దుబాయ్, అబుదాబి వేదికలుగా ఈ మ్యాచ్లు జరగనున్నాయని తెలిపారు. 51 రోజుల పాటు యూఏఈలో ఈ మ్యాచ్లు నిర్వహిస్తామని అన్నారు. అయితే దేశం వెలుపల జరిగే ఈ టోర్నీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించాల్సి […]
వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఐపీఎల్ -13 సీజన్ జరగడంపై ఉత్కంఠ వీడింది. తేదీలు ఖారాయ్యాయి. అంతా అనుకున్నట్టుగానే సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్ జరుగుతుందని పాలకమండలి చైర్మన్ బ్రిజేశ్ పటేల్ అధికారికంగా వెల్లడించాడు.
యూఏఈలోని షార్జా, దుబాయ్, అబుదాబి వేదికలుగా ఈ మ్యాచ్లు జరగనున్నాయని తెలిపారు. 51 రోజుల పాటు యూఏఈలో ఈ మ్యాచ్లు నిర్వహిస్తామని అన్నారు. అయితే దేశం వెలుపల జరిగే ఈ టోర్నీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించాల్సి ఉంటుందని అన్నారు.
కేంద్రం నుంచి టోర్నీకి గ్రీన్సిగ్నల్ లభిస్తుందని ఆశిస్తున్నామని అభిప్రాయ పడ్డారు. సెప్టెంబరు 15 లోపే కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఇంగ్లండ్-ఆస్ట్రేలియా సిరీస్ కూడా ముగుస్తాయని అన్నారు. ఈ దేశాల ఆటగాళ్ల అందుబాటును దృష్టిలో ఉంచుకుని వచ్చేవారం కౌన్సిల్ సమావేశంలో తుది షెడ్యూల్ను ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. అయితే యూఏఈలోని కొవిడ్-19 నిబంధనల ప్రకారం ఆటగాళ్లంతా అక్కడ రెండు వారాలపాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుందని పటేల్ తెలిపారు.