రాష్ట్ర వ్యాప్తంగా అడుగడున చెక్పోస్టులు పెట్టి ఓటర్ల ప్రలోభాలకు గురి చేసిన వారిపై నిఘా పెట్టింది ఈక్రమంలో భారీగా నగదు, లిక్కర్, డ్రగ్స్ జప్తు చేసింది. స్వాధీనం చేసుకున్న వాటిలో నగదు, విలువైన వస్తువులు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఇతర వస్తువులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.