AP Local Body Elections: ఇవిగో వాస్తవాలు.. ఇప్పుడు చూపించండి.. చంద్రబాబుకు సజ్జల రామకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్..
AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..
AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఫలితాల విషయంలో చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని అన్నారు. ఆ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. ఇవిగో నిజాలు అంటూ వీడియోను కూడా ట్యాగ్ చేశారు. ‘చంద్రబాబు గారూ.. నిన్న మీ ప్రెస్మీట్లో ఏజెన్సీలో మొత్తం పంచాయతీలు గెలిచామని చెప్పుకున్నారు. ఎవరిని మభ్యపెట్టడానికి ఈ మాటలు అంటున్నారు. వైఎస్ఆర్సీపీ మద్ధతుదారుల విజయవానికి కనుచూపు మేరలోకూడా టీడీపీ మద్ధతు దారులు లేరు. వాస్తవాలేంటో మేం చూపిస్తున్నాం. మీరన్నట్లుగా మీవాళ్లే గెలిస్తే చూపించండి.’ అంటూ చంద్రబాబుకు సజ్జల రామకృష్ణా రెడ్డి సవాల్ విసిరారు.
Sajjala Rama Krishna Reddy Tweet:
చంద్రబాబుగారు @ncbn నిన్నటి మీ ప్రెస్మీట్లో ఏజెన్సీలో మొత్తం పంచాయతీలు గెలిచామన్నారు. ఎవరిని మభ్యపెట్టడానికి ఈ మాటలు అంటున్నారు. వైయస్సార్సీపీ మద్దతుదార్ల విజయానికి కనుచూపు మేరలోకూడా @JaiTDP మద్దతుదారులు లేరు. వాస్తవాలేంటో కింద ఇచ్చాం. మీరన్నట్టుగా మీవాళ్లే గెలిస్తే చూపించండి. pic.twitter.com/zttT3AmTEM
— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) February 19, 2021
Also read:
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. ఆ అధికారం ఎస్ఈసీకి లేదన్న ధర్మాసనం