Andhra Pradesh: ఆస్తి కోసం కూతురు దారుణ నిర్ణయం.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో లైవ్ సూసైడ్

|

May 29, 2023 | 10:11 AM

ఇదో ఊహించని ఘటన.. మాట్లాడుతూ మాట్లాడుతూనే ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. ఆమె వాగ్వాదమే కదా చేస్తోందని అంతా అనుకున్నారు.. ఇలా చూస్తూ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు.

Andhra Pradesh: ఆస్తి కోసం కూతురు దారుణ నిర్ణయం.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో లైవ్ సూసైడ్
Andhra Pradesh Crime News
Follow us on

ఇదో ఊహించని ఘటన.. మాట్లాడుతూ మాట్లాడుతూనే ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. ఆమె వాగ్వాదమే కదా చేస్తోందని అంతా అనుకున్నారు.. ఇలా చూస్తూ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలోని ప్రతిపాడులో చోటుచేసుకుంది. ఆస్తి కోసం తల్లితో గొడవ పెట్టుకుంటూనే కూతురు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెప్ప పాటులో అంటుకున్న మంటలు.. నిమిషంలోనే ఆమె ప్రాణం తీశాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడులో తల్లి ఆదిలక్ష్మి, కూతురు సుజాత ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. సుజాత సరిగా చూడడంలేదని ఆరోపిస్తూ కొద్దిరోజుల క్రితం పోలీసులకు, హోంమంత్రి సుచరితకు ఫిర్యాదు చేసింది తల్లి ఆదిలక్ష్మి.

ఇద్దరి మధ్య రాజీలో భాగంగా ఇంటి మధ్యలో గోడకట్టాలని పెద్దలు సూచించారు. గోడ కట్టేందుకు ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. ఇంటి మధ్యలో గోడకట్టొద్దని పెద్దలతో వాదనకు దిగిన సుజాత.  ఈ క్రమంలో వాళ్లను వారించేందుకు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుంది. అందరూ ఆమె బెదిరిస్తోందని అనుకున్నారు. ఆమె కూడా అలాగే అనుకుందో ఏమో తెలీదుగానీ.. అగ్గిపుల్ల గీసిందో లేదో.. క్షణాల్లో ఒంటికి నిప్పంటుకుంది.

క్షణాల్లోనే ఆ మంటల్లో సూజాత సజీవదహనమైంది. ఈఘటనకు సంబంధించి అక్కడున్న వారు సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..