AP – Telangana: చలికాలంలో వానలేంటి..? తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉండనుంది అంటే
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం కింద శుక్రవారం కోనసీమ, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి .. .. ..

నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం కోనసీమ, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాలు పడే ప్రాంతాల్లో రైతులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలి. చెట్ల కింద నిలబడవద్దు. వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లండి. ఉష్ణోగ్రతలు సుమారుగా 26°C నుంచి 32°C మధ్య ఉండవచ్చు. నైరుతి, ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీచవచ్చు.
తెలంగాణలో 7వ తేదీ వాతావరణం వాతావరణం పొడిగానే ఉండే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురవవచ్చు. హైదరాబాద్ నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత 22°C నుంచి 30°C మధ్య ఉండవచ్చు. కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
